హైదరాబాద్ లో 14 ఎకరాల ద్రాక్ష తోట, పెద్ద ఫామ్ హౌస్ ఉన్న హీరోయిన్ ఎవరు? మురళీ మోహన్ చెప్పిన రహస్యం

Published : Sep 09, 2025, 11:48 AM IST

ఫిల్మ్ స్టార్స్ చాలామంది కోట్లలో ఆస్తులు కూడబెడుతుంటారు, పలు వ్యాపారలు కూడా చేసి సినిమాలకంటే ఎక్కువగా సంపాదిస్తుంటారు. ఆస్తులు కూడా భారీగా కొంటుంటారు. ఈక్రమంలో హైదరాబాద్ లో 14 ఎకరాల ద్రాక్షతోట ఉన్న ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

PREV
14

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలైనా, హీరోయిన్లు అయినా ఎవరైనా సరే స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడంతో పాటు, ఆర్ధికంగా జాగ్రత్తగా లేకపోతే, ఎంత సంపాధించినా చివరకు పేదరికంతో ఇబ్బందిపడాల్సిందే. సావిత్రి, గిరిజ, రాజనాల, కాంతారావు లాంటి ఎంతో పెద్ద పెద్ద యాక్టర్లు డబ్బు విషయంలో జాగ్రత్తపడకపోవడం వల్లే, చివరిదశలో ఎన్నో కస్టాలు అనుభవించారు. కాని అదే టైమ్ లో అక్కినేని నాగేశ్వారావు, శోభన్ బాబు, మురళీ మోహన్ లాంటి స్టార్లు తాము సినిమాల్లో సంపాదించినది వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం, భూములు కొనడం ద్వారా వేల కోట్ల ఆస్తిని సంపాదించుకోగలిగారు.

24

ఈక్రమంలో హీరోయిన్లు కూడా ఎంతో మంది ఆస్తులు కొని ఆతరువాత కాలంలో కోటీశ్వరులుగా బ్రతికారు. ఆతరం తారలు చెన్నైలోనే కాదు, హైదరాబాద్ లో కూడా ఆస్తులు కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో హైదరాబాద్ లో అలనాటి హీరోయిన్ కు 14 ఏకరాలలో ద్రాక్షతోట, అందులో పెద్ద ఫామ్ హౌస్ ఉండేదట. ఆ హీరోయిన్ కు మనసు బాగాలేకపోతే అక్కడికి వచ్చి ఓ పది రోజులు రెస్ట్ తీసుకునివెళ్లేవారట. ఆతోట చుట్టు పెద్ద పెద్ద గోడలతో సెక్యూరిటీ కూడా ఉండేదట . ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

34

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. అవును తమిళులు అమ్మ అని ఆరాధించే ఆమె, హీరోయిన్ గా ఎన్ని సినిమాల్లో నటించారో తెలిసిందే. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించిన జయలలిత, ఆతరువాత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. కేజీల కొద్ది బంగారం , ఆస్తుల విషయంలో కేసులు కూడా ఫేస్ చేశారు. అయితే ఆమెకు చెన్నైతో పాటు హైదరాబాద్ లో కూడా ఎన్నో ఆస్తులు ఉన్నాయని ఓ ఇంర్వ్యూలో ఆతరం నటుడు మరళీ మోహన్ అన్నారు.

44

మురళీ మెహన్ ఇండస్ట్రీకి రాకముందే జయలలితకు హైదరాబాద్ లో 14 ఎకరాల్లో ద్రాక్షతోట ఉండేదని, అందులో పెద్ద రాజభవనం కూడా ఉందని, మనశ్శాంతి కోసం ఆమె అక్కడికి వచ్చేవారట. మరి ఇప్పుడు ఆ ప్రాంతం డెవలప్ మెంట్ కు ఇచ్చారని, మరి అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలియదని మురళీ మోహన్ అన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులకు ఆర్ధికంగా సలహాలు ఇచ్చిన ఘనత శోభన్ బాబుదే. సంపాదించిన ప్రతీ పైసా భూమి మీద పెట్టాలని, అది రెట్టింపు అవుతుందని శోభన్ బాబు తన తోటి నటులకు సలహాగా ఇచ్చేవారు. అలా ఆయన సలహాలు పాటించిన చాలామంది ఆర్ధికంగాబాగుపట్టారు. వారిలో మరళీ మోహన్ కూడా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories