ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలైనా, హీరోయిన్లు అయినా ఎవరైనా సరే స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడంతో పాటు, ఆర్ధికంగా జాగ్రత్తగా లేకపోతే, ఎంత సంపాధించినా చివరకు పేదరికంతో ఇబ్బందిపడాల్సిందే. సావిత్రి, గిరిజ, రాజనాల, కాంతారావు లాంటి ఎంతో పెద్ద పెద్ద యాక్టర్లు డబ్బు విషయంలో జాగ్రత్తపడకపోవడం వల్లే, చివరిదశలో ఎన్నో కస్టాలు అనుభవించారు. కాని అదే టైమ్ లో అక్కినేని నాగేశ్వారావు, శోభన్ బాబు, మురళీ మోహన్ లాంటి స్టార్లు తాము సినిమాల్లో సంపాదించినది వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం, భూములు కొనడం ద్వారా వేల కోట్ల ఆస్తిని సంపాదించుకోగలిగారు.