రష్మిక మందన్న, పూజా హెగ్డే, కృతి శెట్టి, కీర్తిసురేష్ జోరు గతేడాది వరకు సాగింది. కానీ ఇప్పుడు ఈ భామల క్రేజ్ పడిపోయింది. సక్సెస్లు లేకపోవడం, సరైన సినిమాలు లేకపోవడంతో వీరంతా డీలా పడిపోతున్నారు. ఇదే సమయంలో శ్రీలీలా, మృణాల్ ఠాగూర్ వంటి కథానాయికలు దూసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు పారితోషికం విషయంలో కూడా ఆ తేడా, ఆ వెనకబాటు తనం కనిపిస్తుంది. కొత్త హీరోయిన్లు పారితోషికం విషయంలో దుమ్మురేపుతుంటే, పాత హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. సీనియర్ స్టార్ హీరోయిన్లని మించిన పారితోషికంతో దూసుకుపోతున్నారు కొత్త భామలు.