Janhvi Kapoor: మగాళ్లు ఆ నోప్పిని ఒక్క నిమిషమైనా భరించగలరా.. అందుకే చిరాకు వస్తోంది.. జాన్వీ కపూర్ ఫైర్‌?

Published : Apr 20, 2025, 09:23 PM IST

 Janhvi Kapoor: మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్‌ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే..   

PREV
15
 Janhvi Kapoor: మగాళ్లు ఆ నోప్పిని ఒక్క నిమిషమైనా భరించగలరా.. అందుకే చిరాకు వస్తోంది.. జాన్వీ కపూర్ ఫైర్‌?

మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్‌ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే.. 

25

పీరియడ్స్ సమయంలో సుమారు నాలుగు నుంచి అయిదు రోజులపాటు మహిళలు భయంకరమైన నొప్పిని అనుభవిస్తారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులను భరిస్తుంటారు. ఆ సమయంలో మూడ్‌ స్వింగ్స్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు నొప్పితో ఇబ్బంది పడుతున్న సమయంలో సహజంగానే మహిళలు చిరాకుగా ఉంటామని శ్రీదేవి కుమార్తె, పాన్ఇండియా హీరోయిన్‌ జాన్వీ కపూర్  చెబుతున్నారు.

35

అలాంటి ఇబ్బంది సమయాల్లో తాము పడే నొప్పి గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మరింత బాధ కలుగుతుందని జాన్వీ అంటోంది. తనకు ప్రతి నెలా పీరియడ్స్‌ వచ్చిన సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ ఉంటాయని.. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. మాట తీరుని బట్టి చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందని, వెంటనే వారు నేను డేట్‌లో ఉన్నానని అర్థం చేసుకుంటారని అంటోంది జాన్వీ.  

45

మహిళలు పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ దాన్ని అర్థంచేసుకున్నా.. అదే ప్రశ్నను పదే పదే అడగడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని అన్నారామె. రీసెంట్‌గా సమంత కూడా మహిళల పీరియడ్స్‌ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తుకు తెచ్చారు. అంతేకాకుండా చాలా మంది పీరియడ్స్‌లో ఉన్నామని ఇప్పటికీ చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారని, చెవిలో చెప్పుకోవడం చేస్తుంటారని, అలాంటి వైఖరి మార్చుకోవాలని సమంత అన్నారు. ఇది ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. 

 

55

ఆడవాళ్లు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కొందరు మగాళ్లు అర్థంచేసుకునే వారు ఉన్నారని జాన్వీ కపూర్ అంటోంది. ఆ బాధను అర్థం చేసుకుని వారికిసాయం చేయడం, ఇంటి పనుల్లో హెల్ప్‌ చేస్తున్నారని అన్నారు. మరికొంరు వ్యంగంగా మాట్లాడుతున్నారని అలాంటి వారు ఒక్క నిమిషం కూడా తాము భరించే నొప్పిని భరించలేరని జాన్వీ చెప్పుకొచ్చారు. ఆ నొప్పిని తట్టుకునే పరిస్థితి వస్తే అనుయుధ్దాలు జరిగేవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పీరియడ్స్‌కు సంబంధించి, మహిళలు అనుభవించే పెయిన్‌ గురించి బహిరంగంగా మాట్లాడటంపై నెటిజన్లు జాన్వీని అభినందిస్తున్నారు. ఇలాంటివి చర్చించడం చాలా అవసరమని అంటున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories