క్రికెట్ బంతిని పోలినట్లు ఉన్న లెదర్ డ్రెస్ లో జాన్వీ కపూర్.. ఆ మూవీ కోసమే, వైరల్ ఫొటోస్

First Published May 10, 2024, 5:05 PM IST

క్రికెట్ నేపథ్యంలో చిత్రం కావడంతో జాన్వీ కూడా ఆ తరహాలోనే ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఆమె క్రికెట్ బంతిని పోలిన లెదర్ డ్రెస్ లో మెరిసింది.

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. 

బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ  దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
 

జాన్వీ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం జాన్వీ రాజ్ కుమార్ రావు తో కలసి మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రంలో నటిస్తోంది. ఇది క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మే 31న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. 

క్రికెట్ నేపథ్యంలో చిత్రం కావడంతో జాన్వీ కూడా ఆ తరహాలోనే ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఆమె క్రికెట్ బంతిని పోలిన లెదర్ డ్రెస్ లో మెరిసింది. క్రికెట్ బంతికి ఎలా కుట్లు ఉంటాయో ఆమె లెదర్ డ్రెస్ లో కూడా అదే తరహా కుట్లు కనిపిస్తున్నాయి. 

జాన్వీ డ్రెస్ పై రాజ్ కుమార్ రావు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శరన్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

click me!