అన్షులా కపూర్, రోహన్ థక్కర్ పెళ్లి రిసెప్షన్లో జాన్వీ కపూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. లావెండర్ రంగు కంచిపట్టు చీరలో మెరిసిపోయింది. ఆమె స్టైలింగ్, నగలు, ముఖ్యంగా చేతిపై ఉన్న మెహెందీ ఆ ఈవెంట్లో హైలైట్గా మారాయి.
అన్షులా కపూర్, రోహన్ థక్కర్ పెళ్లి రిసెప్షన్కు బాలీవుడ్ తారలంతా ఫ్యాషనబుల్గా హాజరయ్యారు. కానీ, అందరి దృష్టినీ జాన్వీ కపూర్ తనవైపు తిప్పుకుంది. లావెండర్ రంగు పట్టుచీరలో సంప్రదాయాన్ని, ఆధునికతను మిక్స్ చేసి సరికొత్తగా కనిపించింది. ఆమె లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
25
శ్రీదేవి గుర్తుగా జాన్వీ కపూర్ ఏం చేసిందంటే?
జాన్వీ కట్టుకున్నది లావెండర్-గోల్డ్ కలర్ కంచిపట్టు చీర. దీనికి వెడల్పాటి ఎంబ్రాయిడరీ బోర్డర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ చీర, సౌత్ ఇండియన్ ఎలిగెన్స్ను ప్రతిబింబించింది. పట్టుచీరలంటే ఎంతో ఇష్టపడే తన తల్లి, దివంగత శ్రీదేవికి నివాళిగా జాన్వీ ఈ చీరను ఎంచుకున్నట్లు సమాచారం.
35
సంప్రదాయ చీరకు జాన్వీ మోడ్రన్ టచ్
ఈ సంప్రదాయ చీరకు జాన్వీ మోడ్రన్ టచ్ ఇచ్చింది. స్ట్రాప్లెస్ బ్యాక్లెస్ బ్లౌజ్తో జత చేసింది. ఇది ఆమె లుక్లో ఎలిగెన్స్ను, కాంటెంపరరీ ఫ్యాషన్ను బ్యాలెన్స్ చేసింది.
ఈ లుక్ను పూర్తి చేయడానికి జాన్వీ ఖరీదైన డైమండ్ నగలని ధరించింది. హెవీ చోకర్ నెక్లెస్, దానికి మ్యాచింగ్ చెవిపోగులు, వడ్డాణం, ఆర్మ్లెట్, గాజులు, ఉంగరాలతో మెరిసిపోయింది. సాఫ్ట్ గ్లామరస్ మేకప్, నీట్ హెయిర్స్టైల్ ఆమె రాయల్ లుక్ను మరింత పెంచాయి.
55
అందరి దృష్టిని ఆకర్షించిన మెహెందీ
డ్రెస్ కంటే ఎక్కువగా జాన్వీ చేతిపై ఉన్న మెహెందీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డిజైన్ను దగ్గరగా చూస్తే, అందులో 'శిఖు' అని రాసి ఉంది. ఇది శిఖర్ పహారియా ముద్దుపేరు. ఈ చిన్న డీటెయిల్ వారిద్దరి రిలేషన్షిప్పై జరుగుతున్న చర్చను మళ్లీ మొదలుపెట్టింది. గత కొన్ని నెలలుగా, జాన్వీ శిఖర్ను గుర్తుచేసే నగలు, వస్తువులు ధరించడం చూస్తూనే ఉన్నాం. సినిమాల విషయానికొస్తే, జాన్వీ కపూర్ ఇటీవల రామ్ చరణ్తో కలిసి 'పెద్ది'లో కనిపించింది. త్వరలో ఒక హారర్ సినిమాతో పాటు మరో సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్లో కూడా నటించనుంది.