రామ్‌ చరణ్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్‌.. చిరుకి, ఆ డైరెక్టర్‌కి ఝలక్‌ ఇచ్చిన జాన్వీ కపూర్‌

First Published Jul 7, 2024, 1:12 PM IST

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లతో `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమాని రీమేక చేయాలని చిరంజీవి, రాఘవేంద్రరావులు కోరుకున్నారు. కానీ వాళ్లకి పెద్ద షాకిచ్చింది శ్రీదేవి కూతురు. 
 

మెగాస్టార్‌ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కలిసి నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `జగదేక వీరుడు అతిలోకసుందరి`. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతమైన కళాఖండం ఈ మూవీ. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా 1990లో విడుదలై సంచలన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. చిరంజీవి నుంచి ఇలాంటి ఓ విభిన్నమైన సినిమా రావడం, శ్రీదేవి దేవకన్యగా నటించడం ఆడియెన్స్ ని ఆద్యంతం కట్టిపడేసింది. 
 

`కల్కి 2898 ఏడీ` చిత్రాన్ని నిర్మించిన అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మించారు. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా ఇప్పటికీ చెబుతుంటారు. కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 15కోట్లు వసూలు చేసింది. కాసుల వర్షం కురిపింది. ఇప్పట్లో అయితే 1500 కోట్లకు సమానమని చెప్పొచ్చు. అంతటి సంచలనాలు క్రియేట్‌ చేసిన ఈ మూవీకి సంబంధించిన రీమేక్‌ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. రీమేక్‌ చేయాలని ఉందని నిర్మాత అశ్వినీదత్‌, దర్శకుడు కే రాఘవేంద్రరావు కూడా తమ ఇంట్రెస్ట్ ని వెల్లడించారు. 
 

Latest Videos


`సౌందర్యలహరి` కార్యక్రమంలో చిరంజీవి కూడా ఈ రీమేక్‌పై కామెంట్‌ చేశారు. రామ్‌ చరణ్‌, తమన్నాతో కలిసి చేస్తే బాగుంటుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ సినిమాల్లోకి రావడంతో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచనని వ్యక్తం చేశారు. దీనిపై తరచూ చర్చ నడుస్తూనే ఉంది. 
 

అయితే తాజాగా దీనిపై శ్రీదేవి కూతురు, `దేవర` హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించింది. రీమేక్‌ చేస్తే బాగుంటుందని తెలిపింది. కానీ రామ్‌ చరణ్‌, తాను రీమేక్‌ చేయాలనుకుంటున్నారని యాంకర్‌ అడగ్గా, బిగ్‌ షాకించే వ్యాఖ్యలు చేసింది. తాను రీమేక్‌ చేయనని తెలిపింది. అమ్మ నటించిన ఏ సినిమాని తాను రీమేక్‌ చేయనని వెల్లడించింది. ఆమె చేసిందంటే అవన్నీ ఐకానిక్‌ మూవీస్‌, ఐకానిక్‌ రోల్స్. వాటిని అలా గానీ, దానికంటే బెటర్‌గా గానీ రీప్లేస్‌ చేయడం, రీక్రియేట్‌ చేయడం సాధ్యం కాదని చెప్పింది జాన్వీ కపూర్‌. తాను అందులో నటించలేనని స్పష్టం చేసింది. ఓ రకంగా జాన్వీ.. చిరు, రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌లకు పెద్ద షాకిచ్చిందని చెప్పొచ్చు. 
 

 ప్రస్తుతం జాన్వీ కపూర్‌.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్‌ సరసన `దేవర` చిత్రంలో నటిస్తుంది. ఇది సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. జాన్వీ మొదటి తెలుగు సినిమా ఇది. దీంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కాబోతుంది. పాన్‌ ఇండియా మూవీగా ఇది రూపొందుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

దీంతోపాటు రామ్‌ చరణ్‌తో మరో సినిమా చేస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. `జగదేవక వీరుడు అతిలోక సుందరి` చిత్ర రీమేక్‌లో రామ్‌ చరణ్‌తో చేయకపోయినా, మరో సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. 
 

click me!