Janaki kalaganaledu: మల్లికకు అవమానం.. జానకిపై పొగడ్తల వర్షం.. ఈరోజు ఎపిసోడ్‌లో ఇంకా?

First Published Aug 3, 2022, 11:30 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి వాళ్ళ మావయ్య మల్లిక చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని జానకికి ఇవ్వమని చెబుతాడు. అప్పుడు జానకి, మల్లిక చేతులలో నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొని పీటల మీద  పెట్టి దీపం వెలిగించి అమ్మవారికి పువ్వుల మాల వేస్తుంది. అందరూ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఈ లోగ పూజారి గారు పూజలు చేస్తూ పెద్ద కోడలిని,పెద్దకొడుకుని పీటల మీద కూర్చొమని చెబుతారు.
 

అప్పుడు జ్ఞానాంబ ,ఈ సంవత్సరానికి చిన్న కోడలిని ,చిన్న కొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి. అని పంతులు గారిని అడగగా, ఆచారం ప్రకారం పెద్దవాళ్ళే కూర్చోవాలి అని చెబుతారు పంతులుగారు.కానీ మల్లికా మాత్రం ఆచారాలు మననించే పుట్టుకొచ్చాయి, పైనుంచి ఊడిపడలేదు కదా అని చెప్పి తన భర్తని బలవంతంగా తెచ్చి పీటల మీద కూర్చుంటుంది. అప్పుడు పూజారి మల్లికని కంకణం కట్టుకోమని అంటారు.
 

అది నేను కిందటి సంవత్సరమే కట్టుకున్నాను అని మల్లికా అంటుంది.అప్పుడు మల్లిక వాళ్ళ మావయ్య, ఇది తోటి కోడల మీద కట్టాల్సిన కంకణం కాదమ్మా అని ఎటకారిస్తాడు. జానకి కూడా రామకి కంకణం కడుతుంది, అలాగే జ్ఞానాంబ, తన భర్తకి కంకణం కడుతుంది. తర్వాత పూజారి గారు అమ్మవారికి ఏదైన మంగళ స్తోత్రం సమర్పించండి అని అనగా మల్లికా బిత్తర చూపులు చూస్తుంది. మల్లిక వాళ్ళ మావయ్య మల్లికని ఎటకారిస్తూ జానకిని పాట పాడమని చెబుతాడు.
 

అప్పుడు జానకి పాట పాడుతుంది. ఆ పాటకి మల్లికా కుళ్ళికోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ మైమరిచిపోతారు. పూజారి తో సహా అక్కడ ఉన్న ముత్తైదువులందరూ జానకి నీ ప్రశంసలతో పొగుడుతారు. పూజారి గారు అంతటితో వ్రతం పూర్తయిందని చెప్పి అందరికీ వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్తారు. మల్లికా అందరికీ వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటాది.ఈలోగా జానకి వాళ్ళ మామయ్య జానకి నీ మిగిలిన వాళ్ళకి  వాయనం ఇవ్వమంటారు.
 

వాయినాలు పుచ్చుకొని ముత్తైదువులందరూ వాళ్ళింటికి వెళ్లి పోతారు. జానకి జ్ఞానాంబకి వాయనం ఇద్దామని చూడగా జ్ఞానాంబ  అక్కడ ఉండదు. అప్పుడు జ్ఞానాంబ వాళ్ళ భర్త జ్ఞానం దగ్గరికి వెళ్లి, ఎక్కడున్నావేంటి అని అడుగుతాడు.ఈ పూజలో నా అవసరం,బాధ్యత అంతా అయిపోయింది అని అంటుంది. నీ బాధ్యత ఇంకా అవలేదు. జానకి వాళ్ళ దగ్గర వాయినం తీసుకుని వాళ్ళని ఆశీర్వదించు అని జ్ఞానాంభ వాళ్ళ భర్త చెపుతాడు.
 

వాళ్ళ ముఖం చూసినప్పుడు  వాళ్ళ చేసిన మోసమే నాకు గుర్తు వస్తుంది. నేను వాళ్లకి ఎలా నా ఆశీర్వాదాలు ఇవ్వగలను? అని అంటుంది. ఒక చిన్న తప్పు చేశారు అని చెప్పి ఆ పేగు బంధాన్ని నువ్వు వదిలించుకుంటావని జ్ఞానాంబ భర్త జ్ఞానాంబ ని అడగగా జ్ఞానాంబా ఆలోచనలలో పడుతుంది.ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!