Devatha: రాదని శ్రీశైలం తీసుకెళ్లే ప్రయత్నంలో మాధవ్.. కొడుకు ప్రవర్తన చూసి భయపడుతున్న జానకమ్మ!

First Published Sep 21, 2022, 12:27 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దేవుడమ్మ రుక్మిణికి ఫోన్ చేసి దేవితో పాటు నీకు నామీద కోపం వచ్చిందా అమ్మ! దేవి నన్ను చూసిన వెంటనే నా దగ్గరకు వచ్చేస్తుంది, ఆదిత్య ని చూసినప్పుడు ఆఫీసర్ అనుకుంటూ వెళ్లి అల్లుకుపోతుందిదేవిని ఎలాగైనా మ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీకే ఇస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవుడమ్మ. మీ ఇంటికి రమ్మని మీరే వేడుకోవడం ఏంటమ్మా అని బాధపడుతూ ఉంటుంది రుక్మిణి. ఆ తర్వాత సీన్లో మాధవ్ దేవుడి గదిలోకి వెళ్లి, దేవుడా ఇన్ని రోజులు ఏమి కోరుకున్నా సరే మీరు ఏమి నెరవేర్చలేదు.
 

 ఇప్పుడు  అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. రాదను ఎలాగైనా శ్రీశైలం తీసుకువెళ్లాలనుకుంటున్నాను కనీసం ఏదైనా జరిగేలా దీవించండి అని చెప్పి రాద దగ్గరకు వెళ్తాడు. మనం శ్రీశైలం బయలుదేరుతున్నాము నా భార్య చనిపోతున్నప్పుడు చివరి కోరిక ఇది. చిన్మయి పుట్టిన వెంటనే జాతకం చూపించినప్పుడు తనకి నాగ దోషమని చెప్పారు పూజారి గారు.దానికి పూజ కోసమని శ్రీశైలం వెళ్దామని బయలుదేరినప్పుడే యాక్సిడెంట్ అయిపోయింది.ఇన్నాళ్లు నేను పట్టించుకోలేదు ఇప్పుడు ఎలాగైనా చిన్మయి కోసం వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవ్.
 

ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు అంటే కచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాడు అని  అనుకుంటుంది రుక్మిణి.ఈ మాటలన్నీ విన్న జానకమ్మ, నేనే కదా చిన్మయి జాతకం వెళ్లి రాయించాను నాగదోషమని నాకు పంతులుగారు చెప్పలేదు కదా,దాని జాతకం చాలా బాగుందని చెప్పారు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో దేవుడమ్మ సత్య దగ్గరికి వెళ్లి,సత్య బాధపడొద్దమ్మా ఆదిత్య నీ దగ్గరికి వస్తాడు. ఎవరికైనా ఏకాంత సమయంలో ఉన్నప్పుడు, లేకపోతే భర్త తో గడపాలనుకున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే కోపం ఉంటుంది.
 

కానీ  అందరికీ నీ మాటే వినిపిస్తుంది కానీ నీ బాధ ఎవరికి అర్థం కాదు. దేవి మీద అరిచావు సత్య పిన్ని నన్ను తిట్టింది అనుకుంటారు కానీ దాని వెనకాతల ఉన్న సమస్య పాపం దానికి తెలియదు కదా. మనం మాట్లాడినప్పుడు చుట్టూ ఎవరు ఉన్నారా అని చూసుకోవాలి. లేకపోతే నీ మీద మాచ్చపడుతుంది అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత సీన్లో రాద ఇంట్లో నుంచి లోపలికి వస్తున్నప్పుడు తను తడి అడుగులు అక్కడ పడతాయి.రాద వెళ్ళిపోయిన తర్వాత మాధవ్ ఆ అడుగుల మీద నడుస్తూ ఏడు అడుగులు నీ పాదం మీద నడిచాను. తాళి కట్టకపోయినా మనకు పెళ్లయిపోయినట్టే. ఇప్పుడు నిజంగానే నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.ఈ మాటలన్నీ విన్న జానకమ్మ మాధవ్ దగ్గరికి వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావురా ఏమైనా తెలుస్తుందా అని అనగా, ఇప్పుడు నీకు అర్థం కావల్సిన అవసరం లేదమ్మా అని అంటాడు మాధవ్. 

చిన్మయికి నాగ దోషం ఉందని నీకు ఎవరు చెప్పారు అని అనగా ఇక్కడ ఎవరికీ ఏ దోషాలు లేవు. దోషాలు అన్నీ నాకే ఉన్నాయి. శ్రీశైలం తర్వాత తొలగిపోతాయి అని వెళ్ళిపోతాడు మాధవ్.ఆ తర్వాత సీన్ లో ఆదిత్య రుక్మిణికి ఎంత ఫోన్ చేసినా సరే రుక్మిణి ఎత్తదు. చివరిసారిగా  ఫోన్ చేసినప్పుడు రుక్మిణి ఫోన్ ఎత్తుతుంది. నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే చెప్పు ఇంక మాట్లాడటం మానేస్తాను అలాగని ఫోన్ ఎత్తకపోవడం ఏంటి అని ఆదిత్య అనగా, ఏమీ లేదు పెనిమిటి మీతో కాకపోతే ఇంకా ఎవరితో మాట్లాడుతాను చెప్పు అని అంటుంది రాద. అప్పుడు ఆదిత్య, నేను నిన్ను కలవాలి అనుకుంటున్నాను బయట నేను చెప్పిన చోటికి రా అని చెప్తాడు. వస్తున్నావు కదా అని అనగా వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రుక్మిణి.
 

అక్కడికి పిలికి నన్ను ఏమంటారు అని అనుకుంటుంది రుక్మిణి. ఆ తర్వాత సీన్లో జానకమ్మ జరిగిన విషయాలన్నీ ఆలోచించి, రాధకి మాధవ ప్రవర్తన ముందే అర్థమై ఉంటుందా? అందుకే అలా బాధపడుతూ ఉండుంటుంది. పాపం తను నాతో కూడా చెప్పుకోలేని పరిస్థితి అని అనుకుంటుంది. ఇంతలో జానకమ్మ వాళ్ళ భర్త ఫోన్ చేసి నేను దారిలో ఉన్నాను ఫైల్ మర్చిపోయిన మాధవ్ ని తెమ్మనను అని అనగా ఇప్పుడు ఆ విషయం ముఖ్యం కాదు లెండి మీరు ముందు ఇంటికి రండి మీతో మాట్లాడాలి అని అంటుంది జానకమ్మ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో  ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!