Devatha: మాధవ కుట్ర.. రుక్మిణిని వెళ్ళిపోమన్న జానకమ్మ.. కుళ్ళిపోతున్న ఆదిత్య!

Published : Sep 27, 2022, 02:50 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...  

PREV
17
Devatha: మాధవ కుట్ర.. రుక్మిణిని వెళ్ళిపోమన్న జానకమ్మ.. కుళ్ళిపోతున్న ఆదిత్య!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దేవుడమ్మ వాళ్ళందరూ జానకమ్మకి పక్షవాతం వచ్చింది అని, మాట పడిపోయింది అని, నడవలేదు అన్న  విషయం తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్, మీరేమీ కంగారు పడొద్దు ఈ మందులు క్రమం తప్పకుండా వాడితే త్వరలోనే నయం అవుతుంది అని అంటారు. బయట నుంచి చూస్తున్న రుక్మిణి కూడా ఆ విషయం తెలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడమ్మ వాళ్ళు బాధ తో గదిలో నుంచి బయటికి వస్తారు. 
 

27

ఆ తర్వాత సీన్లో రుక్మిణి ఏడుస్తూ ఉండగా నర్స్ వచ్చి,పేషెంట్ ఏదో చెప్పాలనుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు కొంచెం వెళ్లి చూడరా అని అనగా రుక్మిణి అక్కడికి  వెళ్లి జానకమ్మ చేయి పట్టుకుంటుంది. జానకమ్మ విషయం చెబుదామని ప్రయత్నించినా సరే రుక్మిణికి ఏమీ అర్థం కాదు. అదే సమయంలో దేవుడమ్మ వాళ్ళు  వస్తున్నారు అని తెలిసి కటన్ వెనకాతల దాక్కుకుంటుంది రుక్మిణి. అప్పుడు దేవుడమ్మ మాధవ తో రాధ ఏది అని అనగా తెలీదు అని మాధవ్ అంటాడు. పక్కనే కటన్ వెనక ఉన్న రుక్మిణి నే  మాధవ్ చూస్తాడు.
 

37

నువ్వు వీళ్ళకి కనబడకూడదు అని దాకున్నవు.నాకు అదే కావాలి నువ్వు నా భార్య అయిన తర్వాత నేనే వీళ్ళకి నా భార్యగా నిన్ను పరిచయం చేస్తాను, అప్పుడు చూడాలి ఆట అని అనుకుంటాడు. ఇంతలో దేవుడమ్మ,నేను వెళ్లి రాదని వెతుకుతాను అని అనగా చిన్మయి ఆపి రాత్రి నుంచి మేమందరం ఇక్కడే ఉన్నాము అని అమ్మ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లింది అని అంటుంది. అప్పుడు దేవుడమ్మ నాకు ఇంక జీవితం తో  రాద కనిపించదేమో అని అనుకోని మాధవ్ తో, ఈరోజు నుంచి జానకమ్మని మీరే దగ్గరుండి చూసుకోవాలి.
 

47

 ఆవిడకి నయమైనా అవ్వకపోయినా అది మీ వల్లే అవుతుంది అని అనగా, దానికి మా భార్య ఉన్నది కదా నా భార్య రాద అని చూసుకుంటుంది అని అంటాడు మాధవ్.దానికి రుక్మిణి,ఆదిత్య ఇద్దరు చిరాకుగా ముఖం పెడతారు. ఇంతలో డాక్టర్ గారు ఏదో మందులు చెబుతున్నట్టున్నారు వెళ్ళు అని మాధవ్ ని అంటాడు ఆదిత్య. అప్పుడు డాక్టర్,ఈరోజు డిశ్చార్జ్ ఇస్తున్నాము,ఈవిడని తీసుకువెళ్లిపోవచ్చు అని చెప్తారు.ఆ తర్వాత సీన్లో సత్య చీకట్లో ఆలోచించుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆదిత్య, దేవుడమ్మ అక్కడికి వస్తారు.
 

57

ఏంటి సత్య ఇల్లంతా ఇంత చీకటిగా ఉన్నది అని అడగా ఇంత త్వరగా వస్తారు అని అనుకోలేదు. ఆంటీ కూడా వచ్చారు అని ఇంత త్వరగా వచ్చేసావా లేకపోతే రావు కదా అని అనగా పని అయిపోయింది వచ్చేసాను అని అంటాడు ఆదిత్య. జానకమ్మ గారికి ఏమైంది అని సత్య అడగగా జరిగిన విషయం అంతా చెప్తుంది దేవుడమ్మ. అప్పుడు సత్య బాధపడుతుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ డిశ్చార్జ్ చేయి ఇంటికి వచ్చేస్తుంది. జరిగిన విషమంతా గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాధ భోజనం పట్టుకుని అక్కడికి వస్తుంది.
 

67

 జానకమ్మ రాదని ఇంటి నుంచి వెళ్ళిపోమని సైగలు చేస్తూ ఉంటుంది.అప్పుడు రాద, మీరు నాకు ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతుంది. మీ కొడుకు బుద్ధి ఎంటో ఇన్నాళ్లు మీకు తెలీదు, నేను ఒక్కదాన్నే బాధపడ్డాను. ఇప్పుడు మీకు తెలుసు కదా ఇన్నాళ్లు నాకు మీరు ధైర్యాన్ని ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే నేను మీకు తోడుగా ఉండి నా రుణాన్ని తీర్చుకోవాలి. మీరు ఇంకేం భయపడొద్దు నేను ఎలాగైనా ఆయన సంగతి తేల్చుతాను అని జానకమ్మకి భోజనం తినిపించి బాధపడొద్దు అని చెప్తుంది.
 

77

 ఆ తర్వాత సీన్లో చిన్మయి,దేవి లకు కూడా రాధ వచ్చి భోజనం తినిపిస్తుంది. అప్పుడు చిన్మయి దేవితో, సత్య పిన్ని  అలా అన్నది అని, నువ్వు వాళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా ఉండడం మంచిది కాదు దేవి. నువ్వు అక్కడికి వెళ్లి బాగా మాట్లాడు.నువ్వు ఇంక ఇలా ఉంటే నా మీద ఒట్టు అని అంటుంది. ఈ మాటలన్నీ వెనకాతల నుంచి వింటున్న మాధవ్ కోపం తో రగిలిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories