Guppedantha Manasu: రిషి తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన వసు.. ఎగ్జామ్ విషయంలో మరో కుట్ర ప్లాన్ చేసిన సాక్షి!

First Published May 20, 2022, 8:39 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జగతి (Jagathi) జీవితంలో మనకు ఎవరూ తోడు రారు.. అన్నీ మనమే ఎదుర్కోవాలి అని అంటుంది. ఇక రిషి (Rishi), వసులు కారులో వెళుతుండగా మీ సొమ్ము ఎవరో తిన్నట్లు ముఖం అలాగా పెట్టరేమిటి అని వసు అడుగుతుంది.  అంతేకాకుండా మీరు వస్తే నాకు కొంచెం ధైర్యం ఉంటుంది కదా సార్ అంటుంది.
 

ఉత్సాహంగా ఎగ్జామ్ రాస్తాను కదా అని అడుగుతుంది. ఇక రిషి (Rishi) కారుదిగి సాక్షి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు గౌతమ్ వసు నో.. అన్నాక ఈ జీవితం మీద ఆసక్తి పోయింది అని అనుకుంటాడు. ఈ లోపు వసు (Vasu) రెస్టారెంట్ కి దగ్గర లో బస్సు ఎక్కుతున్నాను వీలుంటే రండి సార్ అని మెసేజ్ పెడుతుంది.
 

అంతేకాకుండా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పకపోతే ఎగ్జామ్ రాయను అని మెన్షన్ చేస్తుంది. ఆ తర్వాత జగతి (Jagathi) ఎదుటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని కూడా మనం ఆలోచించాలి అని వసు తో అంటుంది. ఇక రిషి (Rishi) అదే రెస్టారెంట్ లో ఉండి వసు కు ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. దానితో వసు చాలా ఆనంద పడుతుంది.
 

మరోవైపు దేవయాని (Devayani) వసు స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అని సాక్షి కి చెబుతుంది. ఇక వసు సాధించే ప్రతి విజయం వసును రిషికి దగ్గర చేస్తుంది అని సాక్షి (Sakshi) కి చెబుతుంది. కాబట్టి వసు ను రిషి కి దగ్గర కానివ్వకూడదు అని సాక్షి ను స్కాలర్ షిప్ టెస్ట్ విషయం లో ఏదో ఒక కుట్ర చేయమని చెబుతుంది.
 

మరోవైపు వసు (Vasu) బస్సు ఎక్కుతున్న క్రమంలో రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక ఒక దగ్గర నుంచి కనపడకుండా రిషి కూడా గమనిస్తాడు. ఇక మహేంద్ర (Mahendra) దంపతులు వసుకు ఆల్ ద బెస్ట్ చెప్పి సెండ్ ఆప్ ఇస్తారు.
 

ఇక మహేంద్ర (Mahendra).. వసు విషయం లో రిషి ఒక అడుగు ముందుకు వేస్తే నే కదా అతడికి సరికొత్త జీవితం తెలిసేది అని అంటాడు. ఈలోగా అటుగా రిషి (Rishi) వెళుతుంటాడు. అది మహేంద్ర చూసి జగతికి చెబుతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!