ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జులై 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజాగా టీమ్ ప్రకటించింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్కు ప్రశాంత్ రాఘతి కథ అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ సిరీస్లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్టైటిల్స్తో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.