తమిళంలో ఎన్నో వెబ్ సిరీస్లు వస్తుంటాయి. కానీ, చాలా మందికి తెలియని, అండర్రేటెడ్గా మిగిలిపోయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గురించి ఈ ఫొటో గ్యాలరీలో తెలుసుకుందాం. Iru Dhuruvam A Must Watch Tamil Crime Thriller on Sony LIV
ఓటీటీ ప్లాట్ఫామ్లలో రోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తూనే ఉంటాయి. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, హారర్ లాంటి జానర్స్ ఉన్నా, ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఊహించని మలుపులు, చివరి వరకు సస్పెన్స్ ఉండటమే దీనికి కారణం. అలాంటి థ్రిల్లర్ ప్రియులు తప్పక చూడాల్సిన ఓ వెబ్ సిరీస్ గురించే ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం.
25
వెబ్ సిరీస్ కథ ఇదే..
ఈ వెబ్ సిరీస్ పేరు 'ఇరు ధురువం'. నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ విక్టర్ సెల్లదురై ఈ కథకు కేంద్ర బిందువు. అతని భార్య అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో అతని జీవితం తలకిందులవుతుంది. అదే సమయంలో, నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. హంతకుడు ప్రతి హత్య తర్వాత ఓ రహస్యమైన క్లూ వదిలి వెళ్తుండటంతో, పోలీసులకు ఈ కేసు సవాలుగా మారుతుంది. ఆధారాలన్నీ ఒకే వ్యక్తి వైపు వేలెత్తి చూపడంతో, ఇది ఒక సైకో కిల్లర్ పనే అని అధికారులు నిర్ధారణకు వస్తారు.
35
ప్రతీ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్
ఈ కేసును విచారించే బాధ్యతను విక్టర్ సెల్లదురైకి అప్పగిస్తారు. కానీ, విక్టర్ ప్రతి అడుగును ముందుగానే ఊహించే ఆ సైకో కిల్లర్, పోలీసులను తప్పుదారి పట్టించడానికి తెలివైన ప్లాన్లు వేస్తుంటాడు. దీంతో విచారణ మరింత సంక్లిష్టంగా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? అతని గతం ఏంటి? విక్టర్ భార్యకు ఏమైంది? చివరికి పోలీసులు ఆ కిల్లర్ను ఎలా పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్.
డైరెక్టర్ ఎం. కుమరన్ ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఎ సైన్ ఆఫ్ లైఫ్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి దీన్ని నిర్మించాయి. ఇందులో నందా దురైరాజ్, ప్రసన్న, అబ్దుల్, సెబాస్టియన్ ఆంటోనీ, అభిరామి వెంకటాచలం వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, మొదట్నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఓటీటీ ఛాయిస్.
55
ఏ ఓటీటీలో చూడొచ్చు?
'ఇరు ధురువం' వెబ్ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సిరీస్ 2019లోనే విడుదలైంది. కానీ, కరోనా లాక్డౌన్ సమయంలోనే ఓటీటీలకు ఆదరణ పెరగడంతో, ఈ అద్భుతమైన తమిళ థ్రిల్లర్ సిరీస్ ఎక్కువ మందికి చేరలేదు. అయితే, ఇప్పుడు చూస్తున్న చాలామంది ఇంత మంచి సిరీస్ ఉందా' అని ఆశ్చర్యపోతూ ప్రశంసిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్కు రెండో భాగం కూడా విడుదలైంది.