డబ్బుల కట్టలపై పడుకున్న హీరోయిన్, మరణం మాత్రం ఒక అనాథలా! డిస్కో శాంతి బయటపెట్టిన నిజాలు!

First Published Oct 15, 2024, 5:30 PM IST

శ్రీహరి భార్య డిస్కో శాంతి లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. డబ్బుల కట్టలపై పడుకుని, విలాసవంతమైన జీవితం గడిపిన ఓ స్టార్ హీరోయిన్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. 
 

డిస్కో శాంతి పాప్యులర్ డాన్సర్స్ లో ఒకరు. నటిగా, ఐటమ్ భాగంగా ఆమె రాణించారు. చిరంజీవితో పాటు పలువురు టాప్ స్టార్స్ సరసన డిస్కో శాంతి స్టెప్స్ వేశారు. 1996లో డిస్కో శాంతి నటుడు శ్రీహరిని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఆమె సినిమాలు చేయలేదు. 

disco shanthi

డిస్కో శాంతి-శ్రీహరికి ముగ్గురు పిల్లలు సంతానం. దురదృష్టవశాత్తు శ్రీహరి అకాల మరణం పొందారు. 2013లో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. శ్రీహరి పెద్ద కుమారుడు హీరోగా ప్రయత్నం చేశాడు. కానీ సక్సెస్ కాలేదు. డిస్కో శాంతి తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు విషయాలు ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. 

ఈ క్రమంలో సిల్క్ స్మితతో తనకున్న  అనుబంధం డిస్కో శాంతి తెలియజేసింది. అలాగే సిల్క్ స్మిత లగ్జరీ లైఫ్ ఎలా ఉండేదో డిస్కో శాంతి వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. సిల్క్ స్మిత చాలా మంచిది. చనువుగా మాట్లాడేది. నేను అక్క అని పిలిచేదాన్ని. తన భర్త గురించి, ఆయన రెండో పెళ్లి, పిల్లల గురించి చెబుతూ ఉండేది. నాతో ప్రతి విషయం పంచుకునేది. 

Latest Videos


సిల్క్  స్మిత ఆ రోజుల్లోనే లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు ఆమె లక్ష నుండి మూడు లక్షల పారితోషికం  ఆర్జించేది. మేము ఆ స్థాయికి రావడానికి పదేళ్ల సమయం పట్టింది. ఆమెది లగ్జరీ లైఫ్. నెలకు రూ. 5 లక్షలు చెల్లించి అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లు కొనుక్కోవచ్చుగా అంటే, వినేది కాదు. 

సిల్క్ స్మిత నోట్ల కట్టల మీద పడుకునేది. నేను అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఎవరూ ఆదరించలేదు. అందుకే ఇప్పుడు నోట్ల కట్టల మీద పడుకుంటున్నాను, అనేది. సెట్స్ లో సిల్క్ స్మితను అందరూ చాలా గౌరవించేవారని... డిస్కో శాంతి అన్నారు. 
 


ఏలూరు సమీపంలో గల ఓ గ్రామంలో పుట్టిన సిల్క్ స్మితకు పెద్దగా చదువు లేదు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బాల్యంలోనే వివాహం చేయడంతో అత్తింటివారి బాధలు తాళలేక ఇంట్లో ఉంది పారిపోయింది. అంచలంచెలుగా ఎదిగిన సిల్క్ స్మిత సౌత్ ఇండియాను ఏలింది. తక్కువ సమయంలో రెండు వందలకు పైగా చిత్రాల్లో సిల్క్ స్మిత నటించింది. 

ఆమె మత్తు కళ్ళకు కుర్రకారు చిత్తైపోయింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని అనంతరం ఆ పొజిషన్ సిల్క్ స్మిత కైవసం చేసుకుంది. విలన్, వ్యాంప్, సపోర్టింగ్ రోల్స్ సైతం సిల్క్ స్మిత చేసింది. ప్రేమలో విఫలం చెందిన సిల్క్ స్మిత ఒంటరి తనాన్ని భరించలేకపోయింది. 1996లో ఆత్మహత్య చేసుకుంది. 

తిరుగులేని స్టార్డం అనుభవించిన సిల్క్ స్మిత శవాన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. సిల్క్ స్మిత అంత్యక్రియలకు ఇండస్ట్రీ నుండీ ఎవరూ రాలేదు. అటు కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం నటుడు అర్జున్ హాజరైనట్లు సమాచారం. సిల్క్ స్మిత కుటుంబ సభ్యులను చేరదీయకపోవడంతో వారు కూడా ఆమెను దూరం పెట్టారు. 

సిల్క్ స్మిత జీవితం పై 2011లో డర్టీ పిక్చర్ పేరుతో బాలీవుడ్ మూవీ తెరకెక్కింది. విద్యాబాలన్, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిలన్ లూథ్రా దర్శకుడు. డర్టీ పిక్చర్ మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో విద్యాబాలన్ బోల్డ్ రోల్ చేసింది. డర్టీ పిక్చర్ విద్యాబాలన్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. 


ఈ మూవీ టైటిల్ పై సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. కొంత వివాదం నడిచింది. సిల్క్ స్మిత మరణించకుండా ఉండి ఉంటే.. మరిన్ని సంచలనాలు సృష్టించేది. నోట్ల కట్టల మీద పడుకున్న సిల్క్ స్మిత ఒక అనాధల ఈ లోకాన్ని వీడింది. 
 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

click me!