`ఈనాడు మన భద్రత కోసం, దేశ గౌరవం కోసం దుష్ట శత్రువు నెదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణ త్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్థం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనలీయ సంకల్పించాను. నా అభిమానుల ఆదరణ, యావదాంధ్ర ప్రజానీకం ఆశీస్సులు, మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యాన్ని జయప్రదం చేయగలవనే విశ్వాసము ఉన్నాను.
నన్నీ కార్యానికి పురికొల్పినవి నా అభిమానుల, కళాపోషకుల, చలనచిత్ర పరిశ్రమల అనుబంధ వ్యాపార సంస్థల, సహకార సంపత్తులు. వారి ఆశీస్సులు అర్థిస్తూ మాతృదేశ సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయ విజ్ణప్తి చేస్తున్నాను` అని ప్రజలను ఉద్దేశించి ఎన్టీఆర్ ఈ లెటర్ని విడుదల చేశారు.