చేతులు పైకెత్తి యాంకర్ రష్మీ టెంప్టింగ్ పోజులు... పండగ వేళ లంగా ఓణీలో మైండ్ బ్లాక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

First Published Jan 16, 2022, 9:32 PM IST


స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi gautam) పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.


రష్మీ పబ్లిక్,ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొంటే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. 
 


ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు. 


రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. 

ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, చాలా కాలంగా ఈ చిత్రం బాక్సులకే పరిమితం చేస్తున్నారు. 
 


ఇక బుల్లితెర సూపర్ స్టార్ గా వెలుగొండిపోతున్న సుడిగాలి సుధీర్-రష్మీ మధ్య ఎఫైర్ ఉందని, చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అయితే ఇది కేవలం కెరీర్ , ఈవెంట్స్ కోసమే అనేది వాళ్ళ సన్నిహితులకు మాత్రమే తెలిసిన నిజం. రష్మీ, సుధీర్ ఈ విషయాన్ని ధృవీకరించినా, వాళ్ళ మధ్య ఏదో ఉందని నమ్మే వాళ్ళు లేకపోలేదు.

నిజానికి ఎవరికీ తెలియని ఓ అజ్ఞాతవ్యక్తితో రష్మీ ప్రేమలో ఉన్నారని ఇటీవలి ఆమె సోషల్ మీడియా పోస్ట్స్, కామెంట్స్ చూస్తే తెలుస్తుంది.రెండు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న రష్మీ, ఎవరో ఒకరిపై మనసు పారేసుకోకుండా ఉండడం జరగని పని. అయితే ఆ బంధాన్ని రష్మీ అసలు బయటకు పొక్కనివ్వలేదు.


ఈ ప్రేమలు, అఫైర్స్ విషయంలో నిజం ఉన్నా లేకున్నా.. రష్మీ ప్రస్తుత ఫోకస్ మొత్తం కెరీర్ పైనే. టెలివిజన్ యాంకర్ ఆమె ఫుల్ బిజీ . ఢీ షో, జబర్దస్త్ (jabardasth) లలో ఆమె యాంకర్ గా ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు అత్యధిక టీఆర్పీ కలిగిన షోలుగా ఉన్నాయి. 

కాగా రష్మీని ఢీ సీజన్ 14 నుండి తొలగించారు. అలాగే సుడిగాలై సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగింది. వీళ్ల సారథ్యంలో షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మరి ఢీ నిర్వాహకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. వీరి నిష్క్రమణతో రేటింగ్ కూడా బాగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

సుధీర్, రష్మీ తమకు తామే షో నుండి తప్పుకున్నారా? లేక నిర్వాహకులు పక్కనబెట్టారనేది తెలియదు. ఢీ షో ప్రేక్షకులు మాత్రం ఈ జంటలు బాగా మిస్ అవుతున్నారు. 
 

కాగా పండగ వేళ ట్రెడిషనల్ వేర్ లో టెంప్టింగ్ ఫోజులతో రెచ్చ గొట్టింది రష్మీ గౌతమ్. ఓ బుల్లితెర ఈవెంట్ కోసం పర్ఫుల్ కలర్ లంగా, ఓణీ ధరించి కిరాక్ ఫోజులతో చెమటలు పట్టించింది. రష్మీ సంక్రాంతి (Sankranthi 2022) లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

click me!