1. రష్మిక మందన్న
2025లో పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన్న. ఈ ఏడాది హిందీలో ఆమె నటించిన ఛావా, సికందర్, తమ్మ, తమిళంలో కుబేర, తెలుగులో ది గర్ల్ఫ్రెండ్ సహా మొత్తం 5 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఛావా, సికందర్, తమ్మ, కుబేర చిత్రాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ ఐదు చిత్రాల మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు 1347.71 కోట్లు. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్గా రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.