ప్రభాస్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా వర్షం. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ వర్షం సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 18 ఏళ్ళు అయిపోయింది. ఈ సందర్భంగా ఈ సినిమాను రీసెంట్ గా రీ రిలీజ్ ,చేశారు మేకర్స్.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా క్లిప్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తెగ సందడి చేస్తున్నారు. ఈ క్లిప్స్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు. థియోటర్ లోపల ఈలలు గోలలతో సందడి వాతావరణం నెలకొంది.
ఇక తాజాగా ఈ సినిమా రీ రిలీజ్పై స్పందించింది హీరోయిన్ త్రిష. ఇన్స్టాలో స్పెషల్ గా పోస్ట్ పెట్టింది. నా తెలుగు సినిమా 18 ఏండ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. . ఈ సినిమా నిన్న మొనన్ననే రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని సినిమాలు అలా ఉండిపోతాయి. ఆ సినిమాలు చిరకాలం నిలిచి ఉంటాయనేందుకు వర్షం సినిమా ఉదాహరణ అన్నారు.
trisha
అంతే కాదు తన మొదటి సినిమా వర్షం అంటే నాకెంతో ఇష్టం మంటుంది త్రిష. ఇప్పటిదాకా వర్షం సినిమాను ఎన్నిసార్లు చూశామో లెక్కే లేదంటుంది బ్యూటీ. ఇంత ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది అంటోంది త్రిష. మీ అభిమానమే నన్ను ఇప్పటికీ నాయికగా ముందుకు నడిపిస్తున్నది అంటూ పోస్ట్ చేసింది.
శోభన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది. ప్రేమికులకు ఆదర్శంగా నిలిచిందీ సినిమా. ఈ సినిమాను లీడ్ తీసుకుని బయట కూడా కొన్ని ప్రేమ కథలు ఇలానే నటిచాయి. 2004 సంక్రాంతికి రిలీజ్ అయిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ కు స్టార్ డమ్ ను.. త్రిషకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధించి పెట్టింది సినిమా.
ప్రభాస్తో..
వర్షం రీరిలీజ్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈక్రమంలో త్రిషను మాత్రం ఎవరు పట్టించుకోవడంలేదు. ఇక ఈమూవీ గురించి రీసెంట్ గా స్పందించింది త్రిష.