Shruti Haasan: శృతి హాసన్ సంచలనం... మిడిల్ ఫింగర్ చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్!

First Published Dec 15, 2022, 10:25 AM IST


శృతి హాసన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటో షేర్ చేయడం సంచలనంగా మారింది. బూతు అర్థంతో కూడిన సైగలు చేసి వార్తలకెక్కింది. 
 

shruti haasan


శృతి హాసన్(Shruti Haasan) యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బోల్డ్ బ్యూటీ మై లైఫ్ మై రూల్స్ అంటుంది. సమాజం, పద్ధతులు అసలే పట్టించుకోదు. శృతి జీవితం తెరిచిన పుస్తకమే... 
 

shruti haasan


ఈ స్టార్ కిడ్ తాజాగా మిడిల్ ఫింగర్ చూపించడం సంచలనం రేపుతోంది. ఫారిన్ బాడీ లాంగ్వేజ్ లో మిడిల్ ఫింగర్ చూపించడం పెద్ద బూతు. కోపంతో ఇతరులకు వార్నింగ్ ఇచ్చేటప్పుడు, ఐ డోంట్ కేర్ అని చెప్పేటప్పుడు ఈ సిగ్నల్ చూపిస్తారు. ఈ క్రమంలో శృతి ఎవరిపై కోపంగా ఉన్నారనేది ఆసక్తి రేపుతోంది. 
 

shruti haasan


కాగా శృతి హాసన్ తన కొత్త ప్రియుడు శాంతను హజారికతో విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృతి మిడిల్ ఫింగర్ చూపించడం ప్రాధానత్య సంతరించుకుంది. అదే సమయంలో పెళ్లి గురించి అడిగితే మండి పడుతుంది. సెలెబ్రిటీల పెళ్లి గురించి అంత ఆత్రం, ఆసక్తి ఎందుకని ఫైర్ అయ్యారు. ఇక శృతి మిడిల్ ఫింగర్ ఎవరి చుపించారనేది క్లారిటీ రాలేదు. 
 

Shruti Haasan


 శృతి హాసన్ ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇతడు శృతి హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న పలు ఫంక్షన్స్ కి హాజరు కావడం విశేషం. నచ్చిన వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం శ్రుతికి అలవాటు. 

shruti haasan

ఆ మధ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. అనూహ్యంగా క్రేజీ ఆఫర్స్ తో పుంజుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్(Prabhas) కి జంటగా సలార్ చిత్రం చేస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
 

అలాగే బాలయ్య, చిరంజీవి(Chiranjeevi) చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి(Veerasimhareddy) మూవీలో శృతి హాసన్ హీరోయిన్. అలాగే చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యలో కూడా ఛాన్స్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతున్నాయి.


ప్రస్తుతం శృతి ఫ్రాన్స్ లో ఉన్నారు. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) షూట్ లో భాగంగా ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. చిరంజీవి-శృతి హాసన్ పై ఇక డ్యూయట్ తెరకెక్కించారు. విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 
 

click me!