రాశీ.. దాదాపు పదేళ్ల పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమని షేక్ చేసిన హీరోయిన్. తెలుగు అమ్మాయి అయిన రాశీ బాలనటిగా కెరీర్ని ప్రారంభించింది. తమిళ చిత్రాల ద్వారా హీరోయిన్గా మారింది. అక్కడ స్టార్ గా ఎదిగి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `పెళ్లి పందిరి` సినిమాతో నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ `గోకుళంలో సీత` చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇందులో పవన్ ప్రియురాలిగా, శ్రీహరి భార్యగా నటించి మెప్పించింది.
ఆ తర్వాత `శుభాకాంక్షలు`, పండగ`, `మనసిచ్చి చూడు`, `డాడీ డాడీ`, `స్వప్నలోకం`, `హరిశ్చంద్ర`, `శీను`, `కృష్ణబాబు`, `ప్రేయసి రావే`, `ఏకే 47`, `పోస్ట్ మ్యాన్`, `ఒకే మాట`, `మూడు ముక్కలాట`, `అమ్మో ఒకటో తారీఖు`, `దేవుళ్లు`, `మా ఆవిడ మీ ద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `దీవించండి`, `చెప్పాలని ఉంది`, `సందడే సందడి`, `నిజం`, `శ్రీరామచంద్రులు` వంటి చిత్రాలతో మెరిసింది. స్టార్ హీరోయిన్గా రాణించింది.
ముఖ్యంగా `శుభాకాంక్షలు`, `ప్రేయసి రావే`, `మూడుముక్కలాట`, `దేవుళ్లు` వంటి చిత్రాలు రాశీని తిరుగులేని హీరోయిన్ని చేశాయి. కెరీర్కి పెద్ద బ్రేక్ ఇచ్చాయి. అంతేకాదు `నిజం` సినిమాలో ఆమె నెగటివ్ రోల్స్ కూడా చేసింది. అలాగే ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది రాశీ. అయితే చాలా వరకు శ్రీకాంత్, జగతిబాబు వంటి హీరోలతోనే చేసింది రాశీ. బాలయ్యతో `కృష్ణబాబు` సినిమాలో మెరిసింది. పదేళ్లు ఊపేసిన ఆమె సడెన్గా సినిమాలు తగ్గించింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.
రాశీ.. శ్రీముని(ఎస్ఎస్ నివాస్)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీముని దర్శకుడు. రాశీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. 2005లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాశీ సినిమాలకు దూరంగా ఉంది. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమయ్యింది. అయితే శ్రీముని ని పెళ్లిచేసుకోవడం, వీరిద్దరి మధ్య లవ్ స్టోరీని ఇటీవల బయటపెట్టింది రాశీ. చాలా విచిత్రంగా తామిద్దరం కలిసినట్టు తెలిసింది.
ఆ టైమ్లో రాశీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగు, తమిళంలో బిజీగా ఉంది. రాశీ నటించిన కొన్ని సినిమాలకు శ్రీముని అసిస్టెంట్గా పనిచేశాడు. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చిత్రీకరణ పూర్తయ్యే సమయంలో సెట్లో ఎవరినైనా ఒకరిని ఆటపట్టించే అలవాటు ఉందట రాశీకి. దీంతో ఆ సమయంలో అసిస్టెంట్ నివాస్ని ఆటపట్టించిందట. నివాస్ గురించి ఓ స్పెషల్ విషయాన్ని చెప్పానని చెప్పు అంటూ మరో అసిస్టెంట్ ద్వారా చెప్పిందట రాశీ.
దీంతో శ్రీముని కన్ఫ్యూజన్లో పడ్డాడట. రెండు రోజులపాటు ఆయన రాశీ వెంటపడ్డాడట. అయినా చెప్పాలేదు. తర్వాత చెబుతానని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుందట. ఆ తర్వాత ఫోన్ చేసి సరదాగా అన్నానని, ఏం లేదని అసలు విషయం చెప్పిందట. దీంతో శ్రీముని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
ఆ సమయంలో రాశీకి సినిమాలు తగ్గుతున్నాయట. దీంతో మ్యారేజ్ చేసుకుని సెటిల్ కావాలనుకుందట.పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో ఫ్యామిలీలో పెద్ద విషాదం. రాశీ ఒంటరిగా ఫీలయ్యింది. శ్రీముని తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి సంబంధాల చర్చ వచ్చినప్పుడు పలు కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు మ్యారేజ్ చేసుకునేందుకు ముందుకు వచ్చారట. కానీ ఎందుకు వాళ్లని చేసుకోవడం రాశీకి నచ్చలేదు.
ఈ క్రమంలో సడెన్గా నివాస్కి షాకిచ్చింది. ఓ రోజు మనం పెళ్లి చేసుకుందామని ఆయనతో చెప్పిందట. రెండు రోజులు టైమ్ తీసుకుని శ్రీముని సైతం ఓకే చెప్పాడు. అలా అనుకోకుండా ఈ ఇద్దరి మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా దర్శకుడిగా మారాడు. దాదాపు 20ఏళ్లుగా ఈ ఇద్దరు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉన్నారు. తాము ఎంత బాగా ఉన్నామని చెప్పడానికి, తమ ప్రేమకి నిదర్శనమే ఈ ఇరవై ఏళ్ల కాపురం అని చెప్పింది రాశీ. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది రాశీ.
2013 తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రాశీ.. కీలక పాత్రల్లో మెరుస్తూ కనిపించింది. తల్లి పాత్ర, అత్త పాత్రలు చేస్తుంది. కళ్యాణ వైభోగమే, ఆకతాయి, లంక సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలు మానేసి సీరియల్స్ తో బిజీగా ఉంది. బలమైన క్యారెక్టర్స్ వస్తే సినిమాలు చేసేందుకు రెడీగా ఉంది.