స్టార్ హీరోలపై కృతి సనన్ సంచలన కామెంట్స్... చిన్న చూపు చూస్తున్నారంటూ!

First Published Apr 12, 2024, 12:52 PM IST

స్టార్ హీరోలను ఉద్దేశించి కృతి సనన్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్నారని ఆమె వాపోయింది.

Kriti Sanon

కృతి సనన్ పరిచయం అక్కర్లేని పేరు. ఆమె తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా... ఫేమ్ రాబట్టింది. కృతి సనన్ కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే. మోడల్ గా ఉన్న కృతి సనన్ ని దర్శకుడు సుకుమార్ వెండితెరకు పరిచయం చేశాడు. 
 

2014  సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నేనొక్కడినే మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఆరంభం లోనే మహేష్ బాబు వంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 

బాలీవుడ్ లో బిజీ కావడంతో తెలుగు పరిశ్రమ మీద ఫోకస్ తగ్గించింది. గత ఏడాది ఆదిపురుష్ మూవీతో మరలా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రభాస్ రాముడిగా చేసిన ఈ రామాయణ గాథ విమర్శల పాలైంది. విజయం కూడా సాధించలేదు. 

పలువురు స్టార్ హీరోలతో జతకట్టిన కృతి సనన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృతి సనన్ మాట్లాడుతూ... పెద్ద హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్స్ కి రారు. కథ బాగుంటే ఆ సినిమాలో ఉంది మగా? ఆడా? అనే విషయం చూడరు. 
 

బాధాకర విషయం ఏమిటంటే ఇప్పటికీ నిర్మాతలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చిన్న చూపు చూస్తున్నారు. ఈ ధోరణి మారాలి. క్రూ మూవీలో స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా బాగానే ఆడుతుంది.. అని అన్నారు. కృతి సనన్ కామెంట్స్ బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సినిమాలో విషయం ఉంటే పెద్ద హీరో అవసరం లేదని ఆమె చెప్పకనే చెప్పారు. 

క్రూ చిత్రంలో కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించాడు. 

click me!