ఫ్యాన్స్ తో సీక్రేట్ మీటింగ్ పెట్టిన కృతి శెట్టి, హీరోయిన్స్ కు షాక్ ఇచ్చిన కన్నడ బ్యూటీ

First Published Jan 15, 2023, 6:03 PM IST

చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి శెట్టి. అంతే కాదే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సాధించింది. ఇక రీసెంట్ గా ఆఫ్యాన్స్ తోనే సీక్రేట్ మీటింగ్ పెట్టిందట బ్యూటీ.. ఎందుకంటే..? 
 

సౌత్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది హీరోయిన్ కృతి శెట్టి., ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా మారిపనోయింది. ఒకవైపు చదువుకుంటూనే.. సినిమాలు కూడా చేసుకుంటూ.. రెండింటిని బ్యాలన్స్ చేస్తోంది బ్యూటీ. తన కంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను కూడా సోషల్ మీడియాలో మెయింటేన్ చేస్తోంది చన్నది. 
 

Krithi Shetty

తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. బేబమ్మగా  బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా భారీ సక్సెస్ ను సాధించడమే కాక తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించించి పెట్టింది కృతికి. ఇక వరుస సినిమాలు ఆమెకోసం క్యూ కట్టాయి. అటు సినిమాలే కాకుండా ఇటు  సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన క్యూట్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే అభిమానులని పెంచుకుంటుంది కృతి. 

ఇక ఈ అమ్మడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.  సినిమాలు చూసి ఫ్యాన్స్ అతవుతున్నవారితో పాటు..సోషల్ మీడియాలో అమ్మడి అందానికి ముగ్ధులై ఫాలో అవుతున్నవారు మరికొందరు. ఇక నెట్టింట్లో కృతి శెట్టికి ఫ్యాన్ పేజీలు ఎక్కువే. దాంతో ఆమెను ఫాలో అవుతున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలో ఆమె తాజాగా తన ఫ్యాన్స్ ను కలుసుకుంది. 
 

తాజాగా కృతి శెట్టి హైదరాబాద్ లో సైలెంట్ గా ఎక్కువ ప్రమోషన్ లేకుండా ఫ్యాన్స్ మీట్ పెట్టింది. సోషల్ మీడియాలో తన ఫ్యాన్ పేజీలు నడిపే వాళ్లందరితో కలిసి కృతి ఈ ఫ్యాన్స్ మీట్ నిర్వహించింది. శనివారం  హైదరాబాద్ లో ఈ ఫ్యాన్ మీట్ జరిగింది. ఇందులో  కృతి పాల్గొంది. 

తన అభిమానులతో ముచ్చటించి, వారికీ ఫోటోలు ఇచ్చింది. అందరితో కలిసి కృతి ఓ సెల్ఫీ కూడా దిగింది. దీంతో ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఇండస్ట్రీలో అంతా ఆశ్చర్యపోతున్నారు. హీరోలు తప్ప ఇలా ఫ్యాన్ మీట్ ను హీరోయిన్లు నిర్వహించింది లేదు. అటువంటిది కృతి శెట్టి నిర్వహించడం... అది కూడా  కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా ఫ్యాన్ మీట్ లు పెట్టి ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేయడం అందరికి షాకింగ్ అని చెప్పాలి. 

Krithi Shetty latest

దాంతో  ఫిల్మ్ కెరీర్ విషయంలో కృతీ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది అంటున్నారు సినీ జనాలు. సినిమాల విషయంలో కూడా ఆమె ఆలోచనలు మారినట్టు తెలుస్తోంది. మొత్తానికి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిన కృతి అప్పుడే ఫ్యాన్ మీట్స్ కూడా నిర్వహిస్తూ అభిమానులకి మరింత దగ్గరవుతుంది.

ఉప్పెన తర్వాత, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్  హిట్స్ కొట్టడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది బ్యూటీ... అంతే కాదు స్టార్ హీరోయిన్ల  లిస్ట్ లోకి చేరిపోయింది కృతి. ఆ తర్వాత రెండు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో కాస్త నిరూత్సాహపడింది. కాని వాటి ప్రభావంతో కృతి అవకాశాలు మాత్రం తగ్గలేదు. 
 

ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా ఉంది కృతి శెట్టి. ఓ పక్క సైకాలజీ చదువుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది ఈ కుర్ర భామ.  ప్రస్తుతం ఆమే చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. 
 

click me!