మా ఆయన దూరంగా ఉన్నారు, తల్లికావడానికి ఇంకా సమయం పడుతుంది

First Published Jul 16, 2021, 12:19 PM IST


చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రియమణి. ఓ తరహా పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. భాషాబేధం లేకుండా అన్ని పరిశ్రమల్లో ఆమె చిత్రాలు చేస్తున్నారు. 

తెలుగులో వెంకటేష్ భార్యగా మధ్య వయస్కురాలైన పాత్ర చేస్తున్నారు ఆమె. నారప్ప అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుండగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
undefined
నారప్ప మూవీ కోసం సొంతగా డబ్బింగ్ చెప్పిన ప్రియమణి, అనంతపురం స్లాంగ్ లో మాట్లాడడానికి చాలా కష్టపడ్డారట. చాలాసార్లు ట్రయల్స్ వేసిన అనంతరం డబ్బింగ్ చెప్పగలిగారట.
undefined
నారప్ప మూవీలో కొన్ని సన్నివేశాలు ఛాలెంజింగ్ గా అనిపించాయని అన్నారు. ఓ సన్నివేశం చేసే సందర్భంలో మెంటల్ గా స్ట్రగుల్ అయినట్లు ప్రియమణి వెల్లడించారు.
undefined
వెంకటేష్ సార్ తో చేయడం చాలా హ్యాపీగా అనిపించిందని ప్రియమణి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఒరిజినల్ వర్షన్ అసురన్ లో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో ప్రియమణి చేశారు.
undefined
రీమేక్ చేస్తున్నప్పుడు పోలికలు సహజం అని ప్రియమణి అన్నారు. మంజు చాలా మంచి నటి, ఆమె ఆ మూవీలో చాల బాగా చేశారు. నేను కూడా చాలా వరకు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ట్రై చేశాను అన్నారు.
undefined
ఇక సినిమాల్లో తల్లిగా చేస్తున్నారు, నిజజీవితంలో ఎప్పుడు తల్లి అవుతారన్న ప్రశ్నకు ప్రియమణి నవ్వుతూ... దానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. అలాగే తన భర్త ముస్తఫా రాజ్ అమెరికాలో ఉన్నట్లు వెల్లడించారు.
undefined
నారప్ప, విరాటపర్వం చిత్రాల్లో తనవి డీగ్లామర్ రోల్స్ అని ప్రియమణి తెలిపారు. ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పరుత్తి వీరన్ మూవీలోని పాత్రలతో ఈ రెండు చిత్రాలలో పాత్రలను పోల్చారు.
undefined
click me!