ఆ దర్శకుడు మరెవరో కాదు కార్తి ‘సర్దార్’తో గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు మిత్రన్ అని తెలుస్తోంది. పి.ఎస్. మిత్రన్ తమిళ చిత్రాలతో పాపులరయ్యాడు. అతడు ప్రత్యేకత ఉన్న దర్శకుడు. హీరో (2019), సర్దార్ (2022), ఇరుంబు తిరై (2018) చిత్రాలతో పాపులరయ్యాడు. ఇరుంబు తిరై అభిమన్యుడు పేరుతో తెలుగులో విడుదలై విజయం సాధించింది.
కొద్ది కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవికి మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వమని సూచించారుట. కానీ ఆ తర్వాత మెగాస్టార్ బిజీ అయ్యిపోవటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. కానీ మిత్రన్ కు తెలుగులో సినిమా చేయాలన్న కోరక మాత్రం పోలేదు. దాంతో రానాని కలిసి కథ చెప్పించారట.