షాహిద్ కపూర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ ఉంది. ఇక మూడో చిత్రం యానిమల్ తో దాదాపు వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ కి చేరువయ్యాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
హీరోలను వైల్డ్ గా ప్రజెంట్ చేయడంలో సందీప్ రెడ్డి దిట్ట. ఆయన క్యారెక్టర్స్ ఇంటెన్సిటీ కలిగి ఉంటాయి. యానిమల్ లో రన్బీర్ కపూర్, బాబీ డియోల్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు మైండ్ బ్లాక్ చేస్తుంది. అదే సమయంలో సందీప్ రెడ్డి చిత్రాలు వివాదాలకు నెలవు. యానిమల్ మూవీకి వ్యతిరేకంగా పలువురు చిత్ర ప్రముఖులు మాట్లాడారు.