నీ సినిమాకి థియేటర్స్ ఇవ్వం అంటూ నిఖిల్ కి బెదిరింపులు.. కన్నీరు పెట్టుకున్న హీరో, ఎమోషనల్ కామెంట్స్

First Published Jul 31, 2022, 5:55 PM IST

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. 

Karthikeya 2

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.  నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. 

Karthikeya 2

ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఆగష్టు 12న కార్తికేయ 2 రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు, ద్వారక నగరం లాంటి భక్తి అంశాలు, సస్పెస్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. 

రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో నిఖిల్ ప్రచార కార్యక్రమాలు షురూ చేశాడు. తాజాగా ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పిన విశేషాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కార్తికేయ 2 రిలీజ్ విషయంలో ఎదురైన ఇబ్బందులపై నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కార్తికేయ 2 రిలీజ్ ఆలస్యం అయింది. నిర్మాతలకు వడ్డీలు కూడా పెరిగిపోయాయి. 

పలుమార్లు చిత్రం వాయిదా పడింది. ఇటీవల విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ అడ్డంకులు సృష్టించారు. నాకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు అని నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీ సినిమాని తర్వాత రిలీజ్ చేసుకో. ఇప్పుడు రిలీజ్ చేస్తే థియేటర్స్ ఇవ్వం అని సుతిమెత్తగా బెదిరించారు. ఆ టైంలో నేను ఏడ్చేశా అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యారు. 

కానీ ఎట్టకేలకు ఈ చిత్రం ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. దిల్ రాజు లాంటి నిర్మాతలు మొదట సోలో రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు అని నిఖిల్ తెలిపాడు. 

ఈ చిత్రం కార్తికేయ మొదటి భాగానికి కొనసాగింపుగానే ఉంటుంది అని నిఖిల్ తెలిపాడు. ద్వారకలో కృష్ణుడు నిర్మించిన నగరం ఏమైంది.. లాంటి మిస్టీరియస్, థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని నిఖిల్ తెలిపాడు. సెన్సార్ సభ్యుల నుంచి అదిరిపోయే టాక్ వచ్చినట్లుగా కూడా నిఖిల్ పేర్కొన్నాడు. 

click me!