నాంపల్లి కోర్టుకు అక్కినేని ఫ్యామిలీ!

First Published Oct 8, 2024, 5:38 PM IST

అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. మంత్రి కొండా సురేఖ పై ఆయన కేసు పెట్టిన నేపథ్యంలో వాగ్మూలం ఇవ్వనున్నారు. 
 

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మాజీ మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో టాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలకు కేటీఆర్ కి ముడిపెడుతూ ఆమె మాట్లాడటం చర్చకు దారి తీసింది.

గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. టాలీవుడ్ నటులు కూడా ఆయన బాధితులే. అసలు నాగ చైతన్య-సమంతల మధ్య మనస్పర్థలు తలెత్తడానికి, విడాకులకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని కొండా సురేఖ అన్నారు. తమ రాజకీయాల కోసం ఓ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని.. కొండా సురేఖపై విమర్శలు వెల్లువెత్తాయి. 

టాలీవుడ్ నటులు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి నటులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. విమర్శల నేపథ్యంలో కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 

Latest Videos


కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టారు. అలాగే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కినేని కుటుంబం మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరైంది. నాగార్జున, నాగ చైతన్య, అమలతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు. అక్కినేని కుటుంబ సభ్యుల వాగ్మూలం కోర్టులో రికార్డు చేశారని సమాచారం. 

అలాగే మరికొందరు సాక్షుల స్టేట్మెంట్స్ సైతం రికార్డు చేశారట. కాగా మొదట క్షమాపణ చెప్పిన కొండా సురేఖ.. నేను ఉన్నదే మాట్లాడాను. సినిమా వర్గాల నుండి మాకు స్పష్టమైన సమాచారం ఉందని సమర్ధించుకోవడం విశేషం. ఇక ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. 
 

KTR Konda surekha

కాగా ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ నాగార్జునకు భారీ షాక్ ఇచ్చింది. తుమ్మిడికుంట సమీపంలో గల నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ప్రధాన నిర్మాణాలను నేలమట్టం చేసింది. 

నాది పట్టా భూమి. తుమ్మిడికుంటను నేను ఆక్రమించలేదు. అయినా కోర్టులో కేసు నడుస్తుండగా నిర్మాణాలను కూల్చివేయడం చట్ట వ్యతిరేకమని నాగార్జున అన్నారు. స్టే ఆర్డర్ ద్వారా కూల్చివేత ఆపివేయించాడు. తెలంగాణ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్న నాగార్జునకు... కొండా సురేఖ రూపంలో ఆయుధం దొరికినట్లు అయ్యింది. హైడ్రా ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో నాగార్జున భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయాడని తెలుస్తుంది. 
 

నాది పట్టా భూమి. తుమ్మిడికుంటను నేను ఆక్రమించలేదు. అయినా కోర్టులో కేసు నడుస్తుండగా నిర్మాణాలను కూల్చివేయడం చట్ట వ్యతిరేకమని నాగార్జున అన్నారు. స్టే ఆర్డర్ ద్వారా కూల్చివేత ఆపివేయించాడు. తెలంగాణ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్న నాగార్జునకు... కొండా సురేఖ రూపంలో ఆయుధం దొరికినట్లు అయ్యింది. హైడ్రా ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో నాగార్జున భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయాడని తెలుస్తుంది. 
 

కాగా నాగ చైతన్య-సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021 ఆరంభంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడివిడిగా ఉన్నారు. ఈ విషయం బయటకు రావడంతో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. 

2024 ఆగస్టు 8న నాగ చైతన్యకు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థమైంది. కొన్నాళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. గతంలో పుకార్లు రాగా ఖండించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో వివాహం జరగనుందని సమాచారం. 

click me!