చిరంజీవి ఈ అవమానం ఫేస్ చేసింది `కోతలరాయుడు` సినిమా సమయంలో అట. 1979లో వచ్చిన ఈ సినిమాకి కే వాసు దర్శకుడు. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. మాధవి ఆయనకు జోడీగా చేసింది. గిరిబాబు, హేమ సుందర, చక్రపాణి, కేవీ చలం, నిర్మలమ్మ, మంజు భార్గవి, ఆర్ నారాయణ మూర్తి, బేబీ తులసి నటించారు. నటి తులసి ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం. ఓ రోజు సినిమా షూటింగ్కి చిరంజీవి లేట్గా వచ్చాడట. ఆయన కోసం టీమ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే హీరో. ఆయనపైనే సన్నివేశాలు తీయాల్సి ఉంది. చిరంజీవి లేట్గా రావడంతో నిర్మాతకు కోపం వచ్చింది. మండిపోయిన నిర్మాత చిరుని ఎండలోనే ఉండాలని ఫనిష్మెంట్ ఇచ్చాడట.