‘బాహుబలి’పై హీరో కార్తీ కామెంట్స్.. ‘పొన్నియిన్ సెల్వన్’తో పోల్చొద్దంటూ.. సంచలన వ్యాఖ్యలు.!

First Published Sep 24, 2022, 1:50 PM IST

ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన తెలుగు చిత్రం ‘బాహుబలి’పై తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ప్రమోషనల్ ఈవెంట్ లో కార్తీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 
 

విభిన్న కథలతో సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్న తమిళ స్టార్ హీరో కార్తీ తాజాగా తమిళంలో రూపొందించిన భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1)లో ముఖ్య పాత్ర పోషించారు. గతంలో ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో అదరగొట్టిన కార్తీ.. మరోసారి అంతకుమించిన పెర్ఫామెన్స్ తో PS1లో కనిపించనున్నాడు. 
 

ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్ర ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. చియాన్ విక్రమ్, కార్తీ,ఐశ్వర్యా రాయ్, త్రిష, జయం రవి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.  విడుదల తేదీ దగ్గరగా పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ మరింతగా పెంచుతున్నారు. ఆడియెన్స్ ఫోకస్ తమ చిత్రంపై పడేలా చేస్తున్నారు.  

ఈ  క్రమంలో నిన్న హైదరాబాద్ లో ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ప్రమోషనల్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. కార్యక్రమానికి ఐశ్వర్యా  రాయ్ బచ్చన్,  త్రిష, కార్తీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధాన్ని వ్యక్త పరిచారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’పై నా షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’ (Baahubali). దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ‘బాహుబలి’ క్రియేట్ చేసిన రికార్డులను ఏ సినిమా కూడా బ్రేక్  చేయలేకపోయింది. కాగా, ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా అదే స్థాయిలో ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. 
 

దీనిపై కార్తీ మాట్లాడుతూ.. ‘మ‌ణిర‌త్నం 40 ఏళ్ల క‌ల పొన్నియిన్ సెల్వ‌న్.  ఇది బాహుబ‌లిలా ఉంటుందా! అని అడుగుతున్నారు. కానీ ఇది బాహుబ‌లిలా ఉండ‌దు. ఎందుకంటే మనం ఇప్ప‌టికే బాహుబ‌లిని చూసేశాం. దీన్ని బాహుబలితో పోల్చాల్సిన అవసరం లేదు. 70 ఏళ్లుగా న‌వ‌లా రూపంలో ఉన్న క‌థ‌ను మ‌ణిర‌త్నం సినిమాగా తీశారు. ఇలాంటి కథలు మన దేశంలో బోలెడన్నీ ఉన్నాయి.’ అని తెలిపారు. 
 

‘పొన్నియిన్ సెల్వన్’లో విక్ర‌మ్‌, జయం ర‌వి, ఐశ్వ‌ర్యా రాయ్ బచ్చన్,  త్రిష‌, విక్ర‌మ్ ప్ర‌భు అంద‌రితో క‌లిసి ప‌నిచేయటం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు గొప్ప‌గా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం తనకుందన్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ,  మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది.  

click me!