ఆసుపత్రిలో రష్మికకి చికిత్స..అల్లు అర్జున్ మూవీ వల్లే ఆమెకి ఈ పరిస్థితి, ప్రముఖ డాక్టర్ కామెంట్స్ వైరల్ 

First Published Sep 24, 2022, 12:52 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

రష్మిక మందనకి తాజాగా చిన్నపాటి చికిత్స జరిగింది. ప్రముఖ డాక్టర్ సమక్షంలో ఆమెకి ఈ వైద్యం జరిగింది. రష్మికకి చికిత్స అంటే ఫ్యాన్స్ కంగారు పడడం సహజం. కానీ రష్మిక హెల్త్ గురించి ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

రష్మిక మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతూ డాక్టర్ గురవారెడ్డిని సంప్రదించింది. ఆయన సోషల్ మీడియా పోస్ట్ బట్టి చూస్తే రష్మికకి వచ్చిన సమస్య అంత సీరియస్ కాదని అర్థం అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 'నువ్వు సామీ సామీ అంటూ మోకాళ్లపై బరువంతా వేసి డ్యాన్స్ చేయడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి' అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన శ్రీవల్లితో ఇలా సరదాగా అన్నాను. 

పుష్ప సినిమా చూసినప్పటి నుంచి ఆమెని అభినందించాలి అని అనుకున్నా. ఆమె మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకి రావడంతో సందర్భం వచ్చింది. బన్నీ కూడా త్వరలో షోల్డర్ పెయిన్ అంటూ వస్తాడేమో అని గురువారెడ్డి ఫన్నీ కామెంట్స్ చేశారు. 

రష్మికతో కలసి తీసుకున్న ఫోటోని పోస్ట్ చేశారు. డాక్టర్ గురవారెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలతో మంచి రిలేషన్ మైంటైన్ చేయడం చూస్తూనే ఉన్నాం. గతంలో శర్వానంద్ గాయపడ్డప్పుడు ట్రీట్మెంట్ అందించింది ఆయనే. 

రష్మిక ప్రస్తుతం పుష్ప 2 కి రెడీ అవుతోంది. చివరగా రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే దళపతి విజయ్ సరసన వారసుడు అనే చిత్రంలో నటిస్తోంది. 

click me!