కూతురు పుట్టిన ఏడేళ్ల తర్వాత కొడుకు.. ఇంత గ్యాప్ కి కారణం ఏంటంటే, హీరో కార్తీ ఎమోషనల్ కామెంట్స్

First Published Sep 13, 2022, 11:46 AM IST

ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చేస్తారు హీరో కార్తీ, సూర్య. వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరికి తమ చెల్లెలు బృంద అంటే కూడా ప్రాణం. 

ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చేస్తారు హీరో కార్తీ, సూర్య. వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరికి తమ చెల్లెలు బృంద అంటే కూడా ప్రాణం. తోబుట్టువులుగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ మధ్య ఉండే ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కార్తీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కార్తీకి తన సతీమణి రంజనితో 2011లో వివాహం జరిగింది. వీరిద్దరికి 2013లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ఏడేళ్ల వరకు వీరికి సంతానం లేదు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత కార్తీ,  రంజని దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ సారి వీరికి కొడుకు జన్మించాడు. 

పాప పుట్టిన తర్వాత మరో సంతానం కోసం ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో కార్తీ వివరించాడు. తాము మొదట ఒక బిడ్డే చాలు అని అనుకున్నాం. కానీ మరో బిడ్డ కూడా అవసరం అని లేటుగా రియలైజ్ అయ్యాం అని కార్తీ తెలిపాడు. నా వరకు అన్నయ్య సూర్య, చెల్లి బృంద ఇద్దరూ దేవుడిచ్చిన బహుమతులు. 

నేను ఒకసారి అనారోగ్యానికి గురయ్యాను. చాలా రోజుల పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా చెల్లి బృంద.. తన పిల్లలని సైతం భర్తకి అప్పగించి నా వద్దకు వచ్చేసింది. నాకు నయం అయ్యే వరకు అన్నీ చూసుకుంది. తోబుట్టువులు అంటే నా చెల్లి అంతలా ప్రాణం ఇస్తుంది. 

నా భార్య విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రంజని ఒకసారి అనారోగ్యానికి గురైంది. తప్పనిసరి షూటింగ్స్ వల్ల ఆమెతో ఉండలేకపోయాను. కానీ రంజని తమ్ముడు ఆమెని చూసుకోవడానికి వచ్చాడు. తన వివాహానికి కొన్ని రోజుల సమయమే ఉన్నప్పటికీ ఆ పనులన్నీ పక్కన పెట్టి తన అక్కని చూసుకున్నాడు. తోబుట్టువుల మధ్య బంధం అంటే అది. 

ఈ సంఘటన వల్లే నాలో ఆలోచన మొదలయింది. నా కూతురుకి కూడా చెల్లో, తమ్ముడో తప్పనిసరిగా ఉండాలని రెండవ బిడ్డని కనేందుకు నిర్ణయించుకున్నట్లు కార్తీ తెలిపారు. ఈ విషయాలని కార్తీ ఎంతో భావోద్వేగంతో తెలిపారు. ప్రస్తుతం కార్తీ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం 1లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

click me!