ఈ చిత్రం విడుదలై నేటికి 23 ఏళ్ళు పూర్తయింది. దర్శకుడు కృష్ణ వంశీ ఎంతో అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాలి బింద్రేతో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. నటి లక్ష్మి, సత్య నారాయణ, శివాజీ రాజా, మారుతీ రావు ఇలా చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ చిత్రానికి అనేక నంది అవార్డులు కూడా దక్కాయి. మహేష్ నటనకు స్పెషల్ జ్యురి అవార్డు లభించింది.