యాంగ్రీ హీరో రాజశేఖర్ ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో పోటీగా సినిమాలు చేశారు. కానీ రాజశేఖర్ ఎప్పుడూ టాప్ 4లో నిలబడలేదు. అందుకు కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
యాంగ్రీ హీరో రాజశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. రాజశేఖర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అంకుశం, మగాడు లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు చిరంజీవి పోటీగా రాజశేఖర్ సినిమాలకు కలెక్షన్స్ వచ్చేవి. అప్పట్లో టాలీవుడ్ లో టాప్ 4 హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరితో రాజశేఖర్ పోటీ పడ్డారు.
25
హీరోగా కెరీర్ ముగిసినట్లేనా ?
ఆ నలుగురు హీరోలు ఇప్పటికీ రాణిస్తున్నారు కానీ రాజశేఖర్ కెరీర్ మాత్రం హీరోగా దాదాపుగా ముగిసింది అనే చెప్పాలి. అంతటి స్టార్ డమ్ ఉన్న రాజశేఖర్ కెరీర్ ఎందుకు ఇలా అయింది అనే సందేహాలు ఉండొచ్చు. దానిని ఇండస్ట్రీలో ప్రధానంగా కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. అవి ఇప్పుడు చూద్దాం.
35
రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాలు
రాజశేఖర్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని మిస్ చేసుకున్నారు. కారణాలు ఏవైనా కానీ ఆ సినిమాలన్నీ రాజశేఖర్ దగ్గరకు వచ్చి వెళ్ళినవే. చంటి, సూర్యవంశం, ఠాగూర్, పెదరాయుడు, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలని రాజశేఖర్ మిస్ చేసుకున్నారు.
ముఖ్యంగా ఠాగూర్ సినిమా విషయంలో పెద్ద వివాదం జరిగింది. రమణ సినిమా రీమేక్ ని రాజశేఖర్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది చిరంజీవి చేతుల్లోకి వెళ్ళింది. 90 వ దశకం మొత్తం ఎలాగోలా క్రేజ్ మైంటైన్ చేస్తూ వచ్చిన రాజశేఖర్ 2000 తర్వాత బాగా డౌన్ అయ్యారు. పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోల రాకతో రాజశేఖర్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ మాత్రం తమ ఆధిపత్యాన్ని కోనసాగించారు.
55
ఆ సమస్య కూడా ప్రభావం చూపింది
రాజశేఖర్ కెరీర్ డౌన్ కావడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే రాజశేఖర్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం. రాజశేఖర్ కి అప్పట్లో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. సాయికుమార్ వాయిస్ రాజశేఖర్ కి కొండంత అండగా నిలిచింది. అప్పట్లో చాలా మంది ప్రేక్షకులు అది సాయికుమార్ ఒరిజినల్ వాయిస్ అనుకునేవారు. సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం మానేశాక.. ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ లపై రాజశేఖర్ ఆధారపడాల్సి వచ్చింది. కొందరు నిర్మాతలు అయితే సాయికుమార్ వాయిస్ ఉంటేనే రాజశేఖర్ తో సినిమా చేస్తాం అని తేల్చేశారు. ఆ విధంగా రాజశేఖర్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.