లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ నటించిన సినిమా..చాలా వరస్ట్, అనరాని మాటలు అనేసి సారీ చెప్పిన హీరోయిన్

First Published Jun 15, 2024, 4:42 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీతో తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీతో తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది. కొన్నేళ్ల పాటు సైలెంట్ గా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలని ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

అయితే వీళ్ళిద్దరూ తొలిసారి నటించిన మిస్టర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కుర్రాళ్ళ క్రష్ హెబ్బా పటేల్ నటించింది. ఓ ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

తన కెరీర్ లోనే వరస్ట్ మూవీ అంటే మిస్టర్ సినిమానే అని హెబ్బా పటేల్ ఓపెన్ గా కామెంట్స్ చేసింది. డైరెక్టర్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ.. బహుశా ఆ పాత్రలో నేనే సరిగ్గా నటించలేదేమో.. నా వల్లే సినిమా ఫ్లాప్ అయిందేమో అంటూ కామెంట్స్ చేసింది. ఏది ఏమైనా నా కెరీర్ లో వరస్ట్ మూవీ మిస్టర్ అని తెలిపింది. 

అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో తన కామెంట్స్ గురించి మరోసారి రియాక్ట్ అయింది. నిజంగా ఆ చిత్రంలో మీ పాత్ర ఏమాత్రం నచ్చలేదా అని యాంకర్ అడిగారు. శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో నటించాలని ఎవరు కోరుకోరు. కానీ ఆ మూవీ వర్కౌట్ కాలేదు. ఆ కామెంట్స్ కి సారీ కూడా చెప్పాను అని హెబ్బా క్లారిటీ ఇచ్చింది. 

Varun Tej

ఒక చిత్రానికి అంగీకరించి అనవసరంగా చేశాం అని నేనెప్పుడూ అనుకోలేదు. మిస్టర్ మూవీ విషయంలో కూడా అంతే. కాకపోతే ఆ మూవీ డిజాస్టర్ అయింది అని బాధపడ్డట్లు హెబ్బా తెలిపింది. 

ప్రస్తుతం హెబ్బా పటేల్.. చైతన్య రావుతో కలసి హనీ మూన్ ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ జూన్ 21న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దీనితో హెబ్బా పటేల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. 

Latest Videos

click me!