మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యిందా.? నమ్రతా ఇచ్చిన హింట్ అదేనా.!

Published : Aug 14, 2022, 04:17 PM ISTUpdated : Aug 14, 2022, 04:19 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నచిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’ . అభిమానులు సహా ప్రేక్షకులు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం  అవుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

PREV
16
మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యిందా.? నమ్రతా ఇచ్చిన హింట్ అదేనా.!

టాలీవుడ్ స్టార్ హీరో,  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రం SSMB28. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఇటు అభిమానులు, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

26

ఇటీవల మహేశ్ బాబు తన టూర్స్ ను కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీతో హైదరాబాద్ కు తిరిగి వచ్చినా విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇటు టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్, పవర్ స్టార్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
 

36

గత నెలలో ‘ఎస్ఎస్ఎంబీ28’ షూటింగ్ ప్రారంభంపై మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఆగస్టు  నెలలో సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. అయితే మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9నే చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు ఎప్పటినుంచో ప్రచారం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. త్రివిక్రమ్ - మహేశ్ హ్యాట్రిక్ కాంబో సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. 
 

46

కొద్ది సేపటి కింద మహేశ్ బాబు తన లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం..  అటు నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodhkar) కూడా మహేశ్ బాబు షూటింగ్ లో పాల్గొన్నట్టు ‘షూట్ డే’ అంటూ ఓ ఫొటోను ట్విట్టర్ హ్యాండిల్ లో వదలడం ‘SSMB28’ ప్రారంభమైనదనడానికి హింట్ గా భావిస్తున్నారు. అలాగే మహేశ్ బాబు వదిలిన న్యూలుక్ ఆ చిత్రంలోనిదేనని అంటున్నారు. అదే లుక్ కావాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. 
 

56

అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మరోవైపు మహేశ్ బాబు ఓ యాడ్ షూట్ చేస్తున్నాడని, అందుకు సంబంధించిన లుక్ నే అదంటూ అంటున్నారు. ఏదేమైనా చిత్రయూనిట్, మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చే వరకు మహేశ్ బాబు -త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 
 

66

గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషనలో ‘అతడు, ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం  హ్యాట్రిక్ కాంబో కూడా రాబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడని ఆడియెన్స్ లో ఆత్రుత మొదలయ్యింది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. 
 

click me!

Recommended Stories