
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రధానోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది. శనివారం సాయంత్రం హైటెక్స్ లో ఈ వేడుక జరిగింది. చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు భారీగా హాజరయ్యారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు పాల్గొని సందడి చేశారు మరి అవార్డులు అందుకున్న వారు ఎవరో ఇందులో చూద్దాం.
`పుష్ప 2` చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డుని అందుకున్నారు.
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని నందమూరి బాలకృష్ణకి అందించారు.
ప్రత్యేకంగా అందించిన కాంతారావు అవార్డుని విజయ్ దేవరకొండ అందుకున్నారు.
పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని దర్శకుడు మణిరత్నంకి అందించారు.
నాగిరెడ్డి- చక్రపాణి ఫిలిం అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు అందజేశారు.
ప్రత్యేకంగా అందించే బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుని దర్శకుడు సుకుమార్కి అందజేశారు.
`మత్తువదలరా 2` చిత్రంలో పాట పాడిన నటి ఫరియా అబ్దుల్లాకి స్పెషల్ జ్యూరీ అవార్డుని అందించారు.
`క` సినిమా దర్శకులు సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ డైరెక్టర్స్ అవార్డుని అందించారు.
2023 మొదటి ఉత్తమ చిత్రం `బలగం`కిగానూ అవార్డుని అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి, నిర్మాతలు, హీరో ప్రియదర్శి.
గద్దర్ ఫౌండేషన్కి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.3కోట్ల చెక్కుని గద్దర్ తనయుడు సూర్య కిరణ్కి అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి.
`లక్కీ భాస్కర్` చిత్రానికి ఉత్తమ రైటర్గా అవార్డులు అందుకుంటున్న వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ(అల వైకుంఠపురములో`, జెర్సీ` చిత్రాలకు కూడా అవార్డులు అందుకున్నారు.
`భగవంత్ కేసరి` చిత్రానికి అవార్డు అందుకున్న బాలయ్య, నిర్మాత.
కమిటీ కుర్రోళ్లు చిత్రానికి అవార్డు అందుకుంటున్న దర్శకుడు.
`అఖండ` చిత్రానికి అవార్డు అందుకుంటున్న నిర్మాత రవీందర్ రెడ్డి, దర్శకుడు బోయపాటి, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.
ఉత్తమ దర్శకుడిగా `కల్కి 2898ఏడీ` చిత్రానికి అవార్డు అందుకున్న నాగ్ అశ్విన్.
ఉప్పెన చిత్రానికి అవార్డు అందుకున్న బుచ్చిబాబు, కృతి శెట్టి, నిర్మాత నవీన్ ఎర్రేని.
గద్దర్ అవార్డులతో కొడుకు అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్ సందడి.
`కమిటీ కుర్రోళ్లు` చిత్రానికి అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, దర్శకులు.
`ఆర్ఆర్ఆర్` చిత్రంలోని `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, రైటర్ చంద్రబోస్లను సత్కరించిన తెలంగాణ ప్రభుత్వం.
`35 ఒక చిన్న కథ కాదు` చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుని అందుకున్న నివేతా థామస్.
ఉత్తమ చారిత్రక చిత్రం `రజాకార్`కి అవార్డు అందుకున్న నిర్మాత, దర్శకుడు.
`పొట్టేల్` చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డుని అందుకున్న అనన్య నాగళ్ల.
`35ః ఒక చిన్న కథ కాదు` చిత్రానికి ఉత్తమ బాల నటులుగా అవార్డులు అందుకున్న అరుణ్ దేవ్,హారిక.
`రాజు యాదవ్` చిత్రానికి బెస్ట్ లిరిక్ రైటర్గా అవార్డు అందుకున్న చంద్రబోస్.
`బాహుబలి` చిత్రానికిగానూ అవార్డులు అందుకున్న రాజమౌళి, నిర్మాత శోభూ యార్లగడ్డ.
`రుద్రమదేవి` చిత్రానికి అవార్డు అందుకున్న దర్శకుడు గుణ శేఖర్.