సమంత నుంచి నిధి అగర్వాల్‌ వరకు, ఈ హీరోయిన్ల కోసం ఏకంగా గుళ్లు కట్టిన అభిమానులు

First Published Sep 20, 2024, 5:03 PM IST

సౌత్‌ సినీ పరిశ్రమలో హీరోయిన్లపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని టెంపుల్స్ తో చూపించారు అభిమానులు. మరి ఎవరెవరికి ఎలాంటి గుడి కట్టారో ఓ లుక్కేయండి. 

తెలుగు ప్రజలకు సినిమా, రాజకీయాలు రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. రాజకీయ నాయకులను, స్వతంత్య్ర సమరయోధులను విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించడం చూశాం. కానీ మన అభిమానులు ఒక అడుగు ముందుకేసి, సినీ నటీమణులకు విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించిన సంఘటనలు జరిగాయి. అలా ఎవరెవరి కోసం ఆలయాలు నిర్మించి అభిమానులు పూజించారో ఓ సారి చూద్దా

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఖుష్బూ

ఇండియన్‌ సినిమా చరిత్రలో మొట్టమొదట ఆలయం నిర్మించి కొనియాడబడిన నటి ఖుష్బూ. 1988లో విడుదలైన 'ధర్మథిన్‌ తలైవన్‌` చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తక్కువ వ్యవధిలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి ఖుష్బూకి ఆమె అభిమానులు తిరుచ్చిలో ఆలయం నిర్మించారు. తర్వాత 2005లో ఆ ఆలయాన్ని కూల్చివేశారు.

Latest Videos


నమిత

తెలుగు, తమిళంలో సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నమిత. విజయ్, అజిత్, సూర్య, విజయకాంత్ తో పాటు తెలుగు హీరోలతోనూ సినిమాలు చేసి  గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు 2008లో ఆలయం నిర్మించారు. తమిళనాడులోని తిరునల్వేలిలో నమిత కోసం ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. ఖుష్బూ తర్వాత ఆలయం నిర్మించబడిన నటిగా నమిత గుర్తింపు తెచ్చుకున్నారు. 

హన్సిక

సౌత్‌ సినీ పరిశ్రమలో చిన్న ఖుష్బూగా పేరు తెచ్చుకున్నారు హన్సిక. ఖుష్బూ కోసం ఆలయం నిర్మించిన అభిమానులు చిన్న ఖుష్బూ హన్సిక కోసం కూడా అలాంటి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. దీని కోసం మధురైలో ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయి, అయితే హన్సిక నిరాకరించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

నయనతార

సౌత్‌ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు నయనతార. ఆమె సినిమాల్లో గ్లామర్ పాత్రలే కాకుండా అమ్మవారి పాత్రలు కూడా పోషించారు.  త్వరలో ఆమె నటించిన 'ముక్కుతి అమ్మన్' చిత్రం రెండో భాగం విడుదల కానుంది. దైవత్వంతో కూడిన నయనతార కోసం కూడా అభిమానులు ఆలయం నిర్మించేందుకు ముందుకొచ్చారు. కానీ నయన్ నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

నిధి అగర్వాల్

ఈ జాబితాలో  హీరోయిన్ నిధి అగర్వాల్ కి చోటు దక్కడం విశేషం. ఆమె తమిళంలో సింబు సరసన 'ఈశ్వరన్', ఉదయనిధితో 'కలగ తలైవన్' వంటి చిత్రాల్లో నటించారు. ఆమె కోసం చెన్నైలోని అభిమానులు 2022లో ఆలయం నిర్మించి కుంభాభిషేకం కూడా నిర్వహించారు. నిధి అగర్వాల్ విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం చేసి పూజలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

సమంత

అభిమానులు ఆలయం నిర్మించి పూజింపబడిన  మరో నటి సమంత. ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా, ఆలపాడు గ్రామంలో గత ఏడాది ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని సమంత పుట్టినరోజు సందర్భంగా కుంభాభిషేకం చేసి ప్రారంభించారు. ఇక్కడ ప్రజలు, అభిమానులు ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుండటం విశేషం. 

click me!