ఇక టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మల్టీస్టారర్లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే హీరోలను పెట్టి మల్టీస్టారర్లు చేసేందుకు దర్శక నిర్మాతలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే. వాటి ఫలితాలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అనుష్క శెట్టి (Anushka Shetty) ఫ్యాన్ ఒకరు ఆసక్తికరంగా స్పందించారు. ఎప్పుడూ హీరోలనే పెట్టి తీస్తున్నారు.. హీరోయిన్లను ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
హీరోలకు సమానమైన క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్లు, తమ కంటే స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ తీయాలని దర్శక, నిర్మాతలను కోరుతున్నారు.
పైగా టాలీవుడ్ లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత, గౌరవం ఇస్తారనే టాక్ ఇతర ఇండస్ట్రీల్లోనూ వ్యాపించింది. ఈ క్రమంలో ఫీమేల్ మల్టీస్టారర్లను కూడా మననే స్టార్ట్ చేసి రికార్డు సెట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. దీంట్లో సాధ్యాసాధ్యాలు ఎంతవరకనేది కూడా చూడాలి.