అతని వెనకే అందరూ వెళ్ళిపోతారు. అంజలి, నీరజ్, మాన్సీ మాత్రం ఉండిపోతారు. ఇంతమంది చేత నన్ను తిట్టించావు కదా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నేను లేకపోతే నువ్వు బ్రతకలేవో చూపిస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ. అప్పటికే బాగా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్న నీరజ్ ఇదంతా నా వల్లే అంటూ కోపంగా కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. నీరజ్ అబ్నార్మల్ గా ఉన్నాడని గ్రహించిన అంజలి తన కారులో నీరజ్ ని ఫాలో అవుతుంది. మరోవైపు వేలంపాట స్టార్ట్ అవుతుంది. కంపెనీ 1300 కోట్లు చెప్పింది అంటారు వేలంపాట నిర్వాహకులు.