`ఆదిపురుష్‌` ట్రైలర్‌లో రాజమౌళిని ఫాలో అయిన ఓం రౌత్‌.. వర్కౌట్‌ అయితే మాత్రం ఇండియన్‌ రికార్డులన్నీ బలాదూర్‌

Published : May 08, 2023, 10:05 PM ISTUpdated : May 09, 2023, 09:09 AM IST

ఇప్పుడు ఎక్కడ చూసినా `ఆదిపురుష్‌` ట్రైలర్‌ గురించిన ఇంకా పబ్లిక్‌లోకి రిలీజ్‌ కాలేదు. కానీ అప్పుడే హైప్‌ పెరిగిపోతుంది. టీజర్‌లో మిస్‌ అయిన ఎలిమెంట్‌ పై ట్రైలర్‌లో ఫోకస్‌ చేశాడని, ఇదే ఇప్పుడు సంచలనాలకు కారణం కాబోతుందని అంటున్నారు.   

PREV
16
`ఆదిపురుష్‌` ట్రైలర్‌లో రాజమౌళిని ఫాలో అయిన ఓం రౌత్‌.. వర్కౌట్‌ అయితే మాత్రం ఇండియన్‌ రికార్డులన్నీ బలాదూర్‌

ప్రభాస్‌ నటించిన `ఆదిపురుష్‌` ట్రైలర్‌ని ఈ సాయంత్రం కొంత మంది అభిమానులకు చూపించారు. రేపు సాయంత్రం ప్రపంచ వ్యాప్తంగా చూపించబోతున్నారు. తాజాగా ట్రైలర్‌ చూసిన ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. టీజర్‌ కంటే చాలా బాగా ఉందని, గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని కామెంట్‌ చేస్తున్నారు. డైలాగ్‌లు ట్రైలర్‌లో హైలైట్‌ అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊగిపోతున్నారు. ప్రభాస్‌ బ్యాక్‌ అంటున్నారు. అంతేకాదు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సోషల్‌ మీడియా సైతం జై శ్రీరాం నినాదం ట్రెండ్‌ అవుతుంది. 
 

26

అయితే కొందరు ఫ్యాన్స్ ఈ ట్రైలర్‌ని లీక్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో ప్రధానంగా దర్శకుడు ఓం రౌత్‌ ఓ ఎలిమెంట్‌ని హైలైట్‌ చేశాడు. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మొదట్లో `ఆదిపురుష్‌` టీజర్‌ని విడుదల చేయగా, దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి, ట్రోల్స్ కి గురయ్యింది. విజువల్స్ బాగా లేవనీ, వీఎఫ్‌ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని, మోషన్‌ పిక్చర్‌ టెక్నాలజీ సెట్‌ కాలేదని అన్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియెన్స్, సినీ వర్గాల నుంచి కూడా పెదవి విరుపు కనిపించింది. 
 

36

దీంతో ట్రైలర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు ఓ రౌత్‌ టీమ్‌. టీజర్‌లో చేసిన తప్పుల నుంచి నేర్చుకుని ట్రైలర్‌లో అవి రిపీట్‌ కాకుండా చూసుకున్నారు. అంతేకాదు ఆడియెన్స్ ని కనెక్ట్ చేసే అంశంపై ఫోకస్‌ చేశారు. అదే `ఎమోషన్స్`. టీజర్లో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. ట్రైలర్‌లో దాన్ని వర్కౌట్‌ చేశాడు. ట్రైలర్‌ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగేలా ప్లాన్‌ చేశారు. ప్రభాస్‌ చేత, లక్ష్మణుడి చేత, హనుమంతుడు, సీత చేత ఎమోషనల్‌ డైలాగ్‌లు చెప్పించారు. అంతేకాదు వారి మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ఎమోషనల్‌గా ఉండేలా కేర్‌ తీసుకున్నారని తెలుస్తుంది.
 

46

ఏ సినిమా అయినా ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే పెద్ద హిట్‌ అవుతుంది. దాని సక్సెస్‌ని అంచనా వేయడం కూడా కష్టం. రాజమౌళి తన సినిమాలతో చేసేది అదే. కథ బలంగా లేకపోయినా, ఎమోషన్స్ మాత్రం పర్‌ఫెక్ట్ గా బ్లెండ్‌ అయ్యేలా చేస్తాడు. ఇప్పుడు ఓం రౌత్‌ అదే పట్టుకున్నాడనిపిస్తుంది. అందుకే ట్రైలర్‌లో దాన్ని ఫోకస్‌ చేశాడు. అదే ఇప్పుడు హైలట్‌గా నిలుస్తుందని సమాచారం. అయితే నిజానికి ట్రైలర్‌లో విజువల్స్ అంత గొప్పగా లేవట, వీఎఫ్‌ఎక్స్ సైతం ఆహో, ఓహో అనేలా లేవని,  కానీ టీజర్‌తో పోల్చితే బాగున్నాయని అంటున్నారు. ట్రైలర్‌లో ఎమోషనల్‌ సీన్లు, డైలాగ్‌లు విజువల్స్ ని డామినేట్‌ చేసేలా ఉన్నాయని, ట్రైలర్‌కి విశేష స్పందనకి అదే కారణమని అంటున్నారు. 
 

56

సినిమా ఏదైనా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం ముఖ్యం. ఆ ఎమోషన్స్ సినిమా ఆసాంతం క్యారీ కావాలి. అలా క్యారీ అయినప్పుడే ఆడియెన్స్ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్స్ లో ఉండిపోతే మిగిలిన అంశాలు చిన్నవిగా కనిపిస్తాయి. ఈ క్రమంలో పెద్ద మిస్టేక్స్ కూడా చిన్నవిగా మారిపోతాయి. దర్శకుడు ఓం రౌత్‌ టీజర్‌ నుంచి నేర్చుకున్న పాఠం ఇదే అని తెలుస్తుంది. ట్రైలర్లో మాదిరిగానే సినిమాలోనూ ఇదే రకంగా ఎమోషన్స్ క్యారీ అయితే సినిమా పెద్ద రేంజ్‌ హిట్‌ అవడం ఖాయం.  
 

66

మెయిన్‌గా ఈ సినిమాకి ఎమోషన్సే బలం. ఎందుకంటే రామాయణం కథ గురించి అందరికి తెలుసు. ఇప్పటికే సినిమాలు, సీరియల్స్, బుక్స్ రూపంలో చూశారు, చదువుకున్నారు. కొత్తగా చెప్పడానికి ఏం ఉండదు. కానీ దాన్ని ఎంత ఎమోషనల్‌గా నడిపించారనేదే ఇంపార్టెంట్‌. సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే ఆదరణ పొందుతుంది, లేదంటే డిజాస్టర్‌గా మారిపోతుంది. భావోద్వేగాలు ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడమనే దానిపైనే సినిమా సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. `ఆదిపురుష్‌` విషయంలో ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయితే, ఓం రౌత్‌ ప్లాన్‌ వర్కౌట్‌ అయితే మాత్రం ఇండియన్‌ సినిమా రికార్డులన్నీ బ్రేక్‌ అయిపోవాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇది జరుగుతుందా? లేదా? అనేది చూడాలి. ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటించిన `ఆదిపురుష్‌`కి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories