Guppedantha Manasu: దేవయానికి షాకిచ్చిన ఫ్యామిలీ.. వసుధార కోసం అభినందన సభ!

First Published Jun 29, 2022, 9:06 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రిషీ (rishi)అమ్మవారికి వసు బాగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. నా మనసులో మాట చెప్పేసాను తన మనసులో మాట కూడా తాను చెప్పేసింది. ఇక చివరగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నారు అది చేయు అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు. నువ్వే తనని నడిపించాలి అని  అమ్మవారిని వేడుకుంటూ అని అమ్మవారి ముందు  వసు పేరు రాస్తాడు. వసు(vasu) పేరును రాసి అమ్మ నువ్వే వసు ని రక్షించాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

 ఇంతలోనే అక్కడికి వసు వస్తుంది. అమ్మవారికీ రిషీ గురించి చెబుతూ రిషీ(rishi) సార్ లేకపోతే నేను లేను నాకు విజయం లేదు అని అంటుంది. ఆ తర్వాత అమ్మ వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. మరొకవైపు జగతి,మహేంద్ర రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర జగతి (jagathi)ముందు కాస్త ఎక్కువ చేస్తూ రిషి కి ఫోన్ చేయగా రిషీ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు మహేంద్ర మళ్ళీ రిషికి ఫోన్ చేయగా అప్పడు రిషి మళ్ళీ ఫోన్ చేస్తాను అని కట్ చేయడంతో జగతి నవ్వుతూ ఉంటుంది.
 

మరొకవైపు వసుధార(vasudhara)అమ్మవారి ముందు రిషి పేరుని రాస్తుంది. ఎలా అయినా రిషి సార్ కి నా మీద ఉన్న కోపం తగ్గేలా చూడు అని అమ్మవారిని వేడుకుంటుంది. మరొకవైపు దేవయాని(devayani)కుటుంబం మొత్తం వసుధారని పొగుడుతూ ఉంటారు. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు ఫణీంద్ర అసలు విషయం చెప్పడంతో దేవయాని వెటకారంగా ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంత పీటలు వేసి అంగరంగ వైభవంగా అన్ని టీవీ చానల్స్ ని పిలిచి భారీగా అభినందన సభ చేయండి అంటూ కాస్త వెటకారంగా మాట్లాడుతున్నారు.
 

అప్పుడు ఫణింద్ర(phanindra)దేవయాని అన్న మాటలు నిజం చేస్తూ అలాగే చేయండి అని మహేంద్ర కు చెబుతాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవయాని, ధరణి నవ్వుతుంటారు. కానీ దేవయాని మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని రిషి పై దొంగ ప్రేమలు కురిపిస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్,రిషీ దగ్గరికి వెళ్ళి వసు (vasu)కి అభినందన సభ చేద్దామనుకుంటున్నాను అనడంతో ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి దాన్ని చెడగొడుతుంది.
 

అప్పుడు దేవయాని వసు గురించి కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు రిషి(rishi)అందులో తప్పేముంది అనడంతో దేవయాని ప్లాన్ బోల్తా పడినట్లు అవుతుంది. మరొకవైపు వసు భోజనం కలిపి పిల్లలకు గోరు ముద్దలు పెడుతూ ఉంటుంది. అప్పుడు రిషీకి కూడా భోజనం పెట్టినట్లు ఊహించుకుంటుంది. మరొక వైపు రిషీ వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు  ధరణి(dharani), రిషీ,వసు రూమ్ దగ్గరికి వెల్లగా అక్కడ వసు లేకపోవడంతో బయట ఎదురు చూస్తూ ఉంటారు.
 

ఇంతలోనే వసుధార(vasudhara)బిందె లో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడు వసు పడుతున్న కష్టం చూసి చలించిపోతారు. రేపటి ఎపిసోడ్ లో వసుధార అభినందన సభ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది అనుకుంటూ ఉండగా రిషి(rishi) అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.వసు ఎంత పిలిచినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.

click me!