వేదిక మీదే ఏడ్చేసిన ఈటీవీ ప్రభాకర్‌.. నేను ఏ తప్పు చేయలేదంటూ!

First Published Aug 26, 2020, 5:11 PM IST

ఈటీవీ ప్రభాకర్‌ ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వేదిక మీదే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని కానీ, చాలా వివాదాలు తనను చుట్టుముట్టాయంటూ ఆయన ఏడ్చేశాడు.

బుల్లితెర మీద వ్యాఖ్యతగా నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటిన నటుడు ప్రభాకర్‌. ఈ టీవీ ప్రభాకర్‌గా అందరికీ సుపరిచితమైన ప్రభాకర్‌, రామోజీ రావు తనయుడు సుమన్‌తో స్నేహం కారణంగా కొంత కాలం హెడ్‌లైన్స్‌లో కనిపించాడు.
undefined
ఆ తరువాత కొంత కాలం వినోద పరిశ్రమకు దూరమైన ప్రభాకర్‌ రీ ఎంట్రీలో మరింత ఫాం చూపిస్తున్నాడు. బుల్లితెర మీద నటుడిగా దర్శకుడిగా సక్సెస్‌ కావటమే కాదు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
undefined
అయితే తాను వివాదాలకు ఎంతగా దూరంగా ఉందామని భావించినా ఏదో ఒక వివాదం తనను వెంటాడుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం స్టార్‌ మాలో ప్రసారమవుతున్న ఇస్మార్ట్‌ జోడి గ్రాండ్‌ ఫినాలేలో భాగంగా తన కెరీర్‌ గురించి భావోద్వేగానికి లోనయ్యాడు ప్రభాకర్‌.
undefined
కెరీర్ మంచి ఫాంలో ఉండగా ఈటీవీలో జరిగిన వివాదంతో ఈటీవీ ప్రభాకర్ చాలా మానసిక క్షోభ అనుభవించాడు. ఆ వివాదం కారణంగా ఆయన కెరీర్‌ కూడా ఇబ్బందుల్లో పడింది. ఆ సమస్యల నుంచి తేరుకోవడానికి ప్రభాకర్‌కు చాలా సమయమే పట్టింది.
undefined
తాజాగా సీనియర్ నటి శివ పార్వతి కూడా ప్రభాకర్ మీద ఆరోపణలు చేసింది. వదినమ్మ సీరియల్ షూటింగ్ సమయంలోనే తనకు కరోనా సోకిందని అయినా ఆ సినిమా నిర్మాత ప్రభాకర్ తనను పరామర్శించలేదంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ వివాదాన్ని ముగించేందుకు ప్రభాకర్‌ ప్రయత్నించినా ఆమె తనకు ఎవరి దయ అక్కర్లేదు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
undefined
ఈ నేపథ్యంలో ఆయన ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వేదిక మీదే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని కానీ, చాలా వివాదాలు తనను చుట్టుముట్టాయంటూ ఆయన ఏడ్చేశాడు.
undefined
click me!