`బేబీ` తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా `ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్` చిత్రంలో నటించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకర మూవీస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇది గత శుక్రవారం విడుదలైంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ బాగుంది, కానీ సెకండాఫ్ డల్గా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అదే సమయంలో యూకేలో మూవీ తీయడంలో అక్కడ కల్చర్ మెయిన్గా చూపించడంతో మన ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కలేదు. దీంతో ఇది సినిమాపై ప్రభావం చూపించింది. సిటీ ఆడియెన్స్ తప్ప బీ, సీ సెంటర్ల నుంచి దీనికి పెద్దగా రెస్పాన్స్ లేదు. దీంతో `ఎపిక్`కి బాక్సాఫీసు వద్ద గట్టి దెబ్బ పడిందని చెప్పొచ్చు.