శిల్పా శెట్టికి షాక్ ఇచ్చిన ఈడీ, రాజ్ కుంద్రా కేసులో హీరోయిన్ ఆస్తులు అటాచ్..

First Published Apr 18, 2024, 2:36 PM IST

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి గట్టి షాక్ తగిలింది. ఆమె భర్త కేసుల ప్రభావం శిల్పాపై పడింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. 

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. తన భర్త రాజ్ కుంద్రపై ఉన్న కేసుల ప్రభావం.. నటి శిల్పాశెట్టిపై పడింది. తాజాగా శిల్పా శెట్టికి  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఆమె పేరిట ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో ఇబ్బంది పడుతున్నాడు రాజ్ కుంద్ర. తాజాగా ఈ షాక్ తో స్టార్ కపుల్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

హీరోయిన్ గా ఎన్నో ఇబ్బందులుపడి.. ఇమేజ్ తెచ్చుకుంది శిల్పా శెట్టి. కోట్లు సంపాదించి.. తను కోరకున్న లగ్జరీ లైఫ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు.. ముంబయ్ లోని కాస్ట్లీ ఏరియాలో.. బీచ్ వ్వ్యూలో 100 కోట్లతో తనకు నచ్చిన ఇంటిని కట్టుకుంది శిల్పా. కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటోంది. కాని రాజ్ కుంద్ర కేసుతో తను కూడా ఇబ్బందుుల పడుతోంది. 

మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన నయనతార..? కన్నప్ప టీమ్ లో లుకలుకలు..?
 

Latest Videos


శిల్పా శెట్టి కి సబంధించి ముంబైలోని జుహూ ఏరియాలో ఉన్న ఆమె ఫ్లాట్ ను ఈడీ  అటాచ్ చేశారు. దీంతో పాటు పూణెలో ఓ బంగ్లా సహా శిల్పాకు సబంధించిన 98 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గురువారం అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు.

పోలీస్ అవ్వబోయి.. పాన్ ఇండియా హీరోగా మారిన నటుడు ఎవరో తెలుసా..? అస్సలు ఊహించరు..

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నమోదైన బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ తోపాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

ఇక ఆర్ధిక నేరాలతో పాటు.. బాలీవుడ్ లో సంచలనంగా మారిన ఫోర్నోగ్రాఫీ కేసులో కూడా ఇబ్బందుుల పడుతున్నారు శిల్పా దంపతులు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న అమ్మాయిలతో  పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. 
 

హీరోయిన్లు కావాలని కలలు కన్నవారిని బలవంతంగా రొంపిలోకి దింపారంటూ..కేసుతో పాటు ఈ కేసులో  మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు.  కేసు దర్యాఫ్తులో భాగంగా.. రాజ్ కుంద్రా తన పేరుమీద ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు. దాంతో ఈ అటాచ్ చేయాల్సి వచ్చిందట. 

click me!