S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్

Published : Jul 11, 2026, 11:31 PM IST

కొన్ని వేల పాటలు పాడి, లెక్కలేనన్ని పురస్కారాలు, జాతీయ అవార్డులు, ప్రశంసలు దక్కించుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఏంటో తెలుసా. వింటే షాకింగ్ గా అనిపించడం ఖాయం.

PREV
13
ఎస్ జానకి చివరి కోరిక

భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఎస్ జానకి మరణం సంగీత ప్రియులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆమె జీవితంలోని చివరి దశలో చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక ఆలోచనలు ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తనకు ఇక ఎలాంటి కోరికలు లేవని, జీవితంలో అన్నీ చూశానని చెప్పిన జానకి.. "నేను ఎవరు?" అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే తనకు మిగిలి ఉందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

23
పరమాత్మను తెలుసుకోవడమే నిజమైన జీవితం

మనిషి ఈ దేహం మాత్రమే కాదని, మనలోని పరమాత్మను తెలుసుకోవడమే నిజమైన జీవితం అని ఎస్ జానకి విశ్వసించేవారు. ఈ దేహం ఒక కారణంతో వస్తుందని, కానీ నిజమైన అస్తిత్వం పరమాత్మలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఆ జ్ఞానం లభించే వరకు దేవుడు ఈ దేహాన్ని కాపాడాలని ప్రార్థించాలని, ప్రతి మనిషి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆలస్యం చేయకూడదని ఆమె సూచించారు. తినడం, నిద్రపోవడం, మళ్లీ పుట్టడం వంటి జీవిత చక్రాన్ని దాటి ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలంటే పరమాత్మను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మరింత అర్థవంతంగా కనిపిస్తున్నాయి.

33
తొలి జాతీయ అవార్డు

ఇక తన సంగీత ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, 'సిరిమల్లె పువ్వ' పాట తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉందని జానకి తెలిపారు. అదే పాటను తమిళంలో పాడినప్పుడు తనకు తొలి జాతీయ అవార్డు వచ్చిందని, తర్వాత తెలుగులో రూపొందించినప్పుడు కూడా నిర్మాతల సెంటిమెంట్ కారణంగా అదే ట్యూన్‌ను కొనసాగించారని చెప్పారు. ఇప్పుడు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె పాటలు, ఆమె స్వరం, అలాగే ఆమె ఆధ్యాత్మిక ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories