Klinkaara : రామ్ చరణ్ కూతురు.. మొట్టమొదటి సారిగా ఇండియాలో దర్శించుకున్న దేవాలయం ఏంటో తెలుసా?

First Published Mar 27, 2024, 12:04 PM IST

పెళ్లైన, పదేళ్లకు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ క్లింకార (Klin Kaara) జన్మించిన విషయం తెలిసిందే. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శించుకున్న ఆలయం ఏదనేది ఆసక్తికరంగా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - ఉపాసన కొణిదెల (Upasna konidela) పెళ్లి 12 ఏళ్ల కింద గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లైన పదేళ్లకు వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.

గతేడాది జూన్ 20న మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా (Klin Kaara) జన్మించింది. చిన్నారి రాకతో మెగా ఇంట సంబరాలు చూస్తూనే ఉన్నాం. వరుణ్ తేజ్ పెళ్లి, చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు వంటి శుభపరిణామాలు సంతోషానిచ్చాయి. 
 

ఇక త్వరలోనే క్లింకార తన మొదటి పుట్టిన రోజును  జరుపుకోబోతోంది. ఇవ్వాళ తండ్రి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birthday) కావడం విశేషం. ఈ సందర్భంగా మెగా అభిమానులు ఆయనకు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఈ సందర్బంగా క్లింకార పుట్టిన సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు తొలిసారి ఇవాళ తిరుమల తిరుపతి దేవాలయాన్ని సందర్శించారు. వేంకటేశ్వరుడిని కుటంబంతో దర్శించుకున్నారు. 

క్లింకార పుట్టాక తిరుపతికి మొదటిసారిగా రావడం విశేషం. అయితే ఇప్పటికే క్లింకార తల్లిదండ్రులతో కలిసి పలు ఆలయాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మొట్టమొదటి సారిగా క్లింకారతో రామ్ చరణ్ దంపతులు ఏ దేవాలయంలో పూజలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. 

రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకారతో మొట్టమొదటి సారిగా ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. చిన్నారి కోసం ప్రత్యేక పూజలు చేయించారు. ఇక ఇప్పుడు తిరుమలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే... చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ నుంచి జరగండి జరగండి సాంగ్ విడుదలై ట్రెండ్ అవుతోంది. 

click me!