టాలీవుడ్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చిన వాళ్లే. రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇలియానా అయితే పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ సెన్సేషన్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానా.