Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!

Published : Mar 16, 2026, 09:00 AM IST

Raja Vannem: దర్శకుడు రాజా వన్నెం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మానవత్వాన్ని కొనియాడారు. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా షూటింగ్ అర్ధరాత్రి సమయంలో జరుగుతుండగా, చిరంజీవి అనూహ్యంగా సెట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

PREV
15
చిరంజీవి గొప్పతనం

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా, వ్యక్తిత్వ పరంగా కూడా ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఆయనతో పనిచేసిన అనుభవాలను దర్శకుడు రాజా వన్నెం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

25
సెట్‌లో చిరంజీవి హల్చల్:

'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి రాజా వివరిస్తూ.. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో చిరంజీవి అకస్మాత్తుగా సెట్‌కు వచ్చారు. ఆ రోజు నిర్మాత ఎడిటర్ మోహన్ పుట్టినరోజు కావడంతో, ఆయనకు సర్ ప్రైజ్ ఇవ్వాలని చిరంజీవి అలా వచ్చారు. సెట్‌లోనే కేక్ కట్ చేసి, స్వయంగా మోహన్‌కి తినిపించడం చూసి యూనిట్ అంతా ఆశ్చర్యపోయింది.

35
డైరెక్టర్ల పట్ల గౌరవం:

చిరంజీవి తన డైరెక్టర్లను పట్టించుకోరని కొందరు చేసే విమర్శలను రాజా తప్పుబట్టారు. "చిరంజీవి గురించి మాట్లాడే అర్హత కూడా చాలా మందికి లేదు. ఆయన స్థాయి వేరు" అని ఆయన ఘాటుగా స్పందించారు. కష్టపడే వ్యక్తికి ఆయన ఇచ్చే గౌరవం అమోఘమని, 'హిట్లర్' సినిమా చర్చల సమయంలో ఎయిర్‌పోర్ట్ వరకు తనను కార్లో తీసుకెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు చర్చించారని గుర్తు చేసుకున్నారు.

45
సినిమా విజయం, పాత్రల రూపకల్పన:

'హిట్లర్' సినిమాలో ఐదుగురు చెల్లెళ్ల పాత్రలు మన పక్కింటి అమ్మాయిల్లాగే ఉండాలని, వారి డ్రెస్సింగ్, ప్రవర్తన ఎంత సహజంగా ఉండాలో చిరంజీవి స్వయంగా సూచించారట.

55
అప్పుడు రూ. 18 కోట్లు.. ఇప్పుడు రూ. 400 కోట్లతో..

ఇక 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' చిత్రం సాధించిన విజయం గురించి చెబుతూ, ఆ రోజుల్లోనే ఈ సినిమా 18 కోట్ల షేర్ సాధించిందని, నేటి మార్కెట్ విలువ ప్రకారం అది 400 కోట్లకు పైమాటే అని రాజా వన్నెం వివరించారు.

Read more Photos on
click me!

Recommended Stories