ఏపీలో సొంత గ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. అన్న కొడుకు చేసిన పనికి రఘువీరా రెడ్డి ఎమోషనల్

First Published Aug 16, 2022, 9:53 AM IST

ప్రశాంత్ నీల్.. దేశం మొత్తం ఈ పేరు మారుమోగిపోతోంది. పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ నీల్. దీనితో ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ప్రశాంత్ నీల్.. దేశం మొత్తం ఈ పేరు మారుమోగిపోతోంది. పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ నీల్. దీనితో ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కెజిఎఫ్ 2 చిత్రం 1200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. హీరో ఎలివేషన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్ కొత్త అర్థం చెప్పారు. గూస్ బంప్ మూమెంట్స్ క్రియేట్ చేసి మాస్ ప్రేక్షకులని కేక పెట్టించారు. 

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న ఆగష్టు 15న ప్రశాంత్ నీల్ ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంకి చెందిన నీలకంఠాపురంని సందర్శించారు. ప్రశాంత్ నీల్ సొంత గ్రామం అదే. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి ఆయా గ్రామంలో పుట్టి పెరిగిన వారే. అంతే కాదు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డికి సుభాష్ రెడ్డి సోదరుడు అవుతారు. అంటే ప్రశాంత్ నీల్ రఘువీరాకు అన్న కొడుకు వరుస. 

ఆగష్టు 15న తన తండ్రి జయంతి కావడంతో ప్రశాంత్ నీల్ కుటుంబ సమేతంగా నీలకంఠాపురంని సందర్శించారు. అంతే కాదు అక్కడ ఆలయాలు సందర్శించి పూజలు చేశారు. రఘువీరా రెడ్డి ప్రశాంత్ నీల్ వెంటే ఉంది అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. 

అనంతరం నీలకంఠాపురంలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ప్రశాంత్ నీల్ రూ 50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. ఏఈ విషయాన్ని రఘువీరా రెడ్డి సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. నాకు, నీలకంఠాపురం గ్రామం ప్రజలకు ఇది గర్వించే క్షణం. నా సోదరుడి కుమారుడు ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి సరిగ్గా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగష్టు 15న జన్మించారని రఘువీరా పేర్కొన్నారు. 

అలాగే ప్రశాంత్ నీల్ మీడియాతో కూడా ముచ్చటించారు. మీ సినిమాల్లో దుమ్ము ధూళి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు అని ఓ విలేకరి సరదాగా ప్రశ్నించాడు. దానికి ప్రశాంత్ నీల్ కూడా సరదాగానే బదులిచ్చారు. మీరు చూస్తున్నారు కదా అందుకే పెడుతున్నా అని అన్నారు. 

తన చిత్రాల్లో ఎంతలా ఎలివేషన్ సీన్స్ ఉండడానికి కారణం తెలుగు సినిమానే అని ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. 

click me!