నా కెరీర్ లోనే శాకుంతలం పెద్ద జర్క్.. అది నిర్ణయించుకున్న తర్వాతే రెండో పెళ్లి చేసుకున్నా: దిల్ రాజు

First Published Apr 27, 2023, 8:18 PM IST

రీసెంట్ గా దిల్ రాజు సమంత 'శాకుంతలం' డిజాస్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం చిత్రం పెద్ద జర్క్ ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్నారు. దిల్ రాజు తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ మీడియా ముందు ప్రస్తావించరు. కానీ రీసెంట్ గా ఇంటర్వ్యూలో దిల్ రాజు తన రెండవ పెళ్లి గురించి రివీల్ చేశారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించారు. 

ఆ తర్వాత రెండేళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు 2020లో తేజస్వినిని వివాహం చేసుకున్నారు.  తాజాగా దిల్ రాజు పాల్గొన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో దిల్ రాజు తన మ్యారేజ్ గురించి చెబుతూ తన భార్య అనిత మరణించిన తర్వాత రెండవ పెళ్లి గురించి చాలా ఆలోచించినట్లు తెలిపారు. 

Latest Videos


తప్పా రైటా అన్ని విషయాలు బేరీజు వేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించారు. తన 25ఏళ్ల కెరీర్.. ఈ కెరీర్ లో తనకి మెమొరబుల్ గా నిలిచిన చిత్రాలు, నిరాశపరిచిన అన్ని చిత్రాల గురించి దిల్ రాజు ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా దిల్ రాజు సమంత 'శాకుంతలం' డిజాస్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం చిత్రం పెద్ద జర్క్ ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. ఇటీవల విడుదలైన శాకుంతలం మూవీ ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. 

గుణశేఖర్ తన కుమార్తె నీలిమతో కలసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు. కానీ రిలీజ్ చేసింది మాత్రం దిల్ రాజు. దీనితో దిల్ రాజుకు కూడా భారీ నష్టం తప్పలేదు. పౌరాణిక చిత్రం గా తెరకెక్కిన శాకుంతలం ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. 

ప్రస్తుతం దిల్ రాజు మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజెర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజెర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!