ఒకప్పుడు శోభన్ బాబుకి చెన్నైలో వేల కోట్ల ఆస్తులు ఉండేవి. హీరోగా పాపులారిటీ వచ్చిన తర్వాత ఒక్కో సినిమాలో నటించడం వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కానీ, ల్యాండ్ కానీ కొనేయడం చేసేవారు. శోభన్ బాబు అప్పట్లోనే ఎంతో ముందు చూపుతో ఆలోచించేవారట. ఈ భూమిపైన 71 శాతం నీరు 29 శాతం మాత్రమే ల్యాండ్ ఉంది. భవిష్యత్తులో ల్యాండ్ కి విపరీతమైన ధర పెరుగుతుంది అని ఆయన గ్రహించారు. అందుకే భూములు కొనడంపై ఎక్కువగా ఆసక్తి చూపేవారు.